గోద్రా రైలు దగ్దం కేసు: యాకూబ్ పాటలియాకు జీవిత ఖైదు
గోద్రా అల్లర్ల కేసులో నిందితుడుగా ఉన్న యాకూబ్ పాటాలియాకు సిట్ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధిస్తూ బుదవారం నాడు తీర్పు చెప్పింది.
న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల కేసులో నిందితుడుగా ఉన్న యాకూబ్ పాటాలియాకు సిట్ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదును విధిస్తూ బుదవారం నాడు తీర్పు చెప్పింది.
2002లో శబరిమల ఎక్స్ప్రెస్ రైలును దగ్ధం చేసిన కేసులో యాకూబ్ పాటాలియా ప్రధాన ముద్దాయి. ఈ కేసులో గుజరాత్ పోలీసులు 2018 జనవరి మాసంలో యాకూబ్ను అరెస్ట్ చేశారు.
2002 ఫిబ్రవరి 27వ తేదీన గోద్రాకు సమీపంలో శబరిమల ఎక్స్ప్రెస్ రైలును దగ్ధం చేశారు. ఈ ఘటనలో సుమారు 59 మంది మృతి చెందారు.
ఈ కేసులో మరో ఇద్దరు కూడ జీవిత ఖైదును విధించింది కోర్టు. ఈ కేసులో మరో ముగ్గురిని కోర్టు నిర్ధోషిగా విడుదల చేసింది.
అయోధ్యలో కరసేవ చేసి శబరి ఎక్స్ప్రెస్ రైలులో తిరిగి వస్తున్న కరసేవకులను లక్ష్యంగా చేసుకొని శబరి ఎక్స్ప్రెస్ను దగ్దం చేశారు. ఈ ఘటన 2002 ఫిబ్రవరి 27వ తేదీన చోటు చేసుకొంది.
ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో అల్లర్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో సుమారు వెయ్యి మంది మరణించారు. ఇందులో ఓ వర్గానికి చెందిన వారు ఉండడం గమనార్హం.గోద్రా ఘటనపై సిట్ విచారణ జరిపింది. ఈ కేసులో 31మందిని నిందితులుగా సిట్ తేల్చింది.