Asianet News TeluguAsianet News Telugu

ఫేస్ బుక్ ఛాటింగ్ తో.. 17యేళ్ల బాలుడిని పెళ్లాడిన 20 యేళ్ల యువతి.. ట్విస్ట్ ఏంటంటే...

ఆమెకు 20 యేళ్లు, అతడికి 17 యేళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వయసు అడ్డురాలేదు. తనకంటే చిన్నవాడితో స్నేహం కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది. చివరికి ఇంట్లో వాళ్లను ఎదరించి మరీ.. ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు.

20 years woman married 17years boy in karnataka - bsb
Author
Hyderabad, First Published Jun 28, 2021, 1:07 PM IST

ఆమెకు 20 యేళ్లు, అతడికి 17 యేళ్లు.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వయసు అడ్డురాలేదు. తనకంటే చిన్నవాడితో స్నేహం కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది. చివరికి ఇంట్లో వాళ్లను ఎదరించి మరీ.. ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు.

అయితే తనకంటే చిన్నవాడిని.. మైనర్ ను ఓ యువతి పెళ్లాడిందన్న వార్త బైటికి తెలియడంతో విషయం కాస్తా పోలీసులకు చేరింది. అంతే, వెంటనే ఎంట్రీ ఇచ్చారు. దీంతో సీన్ రివర్స్ అయ్యింది. మైనర్ ను పెళ్లాడిన యువతి మీదనే కాదు.. ఆ పెళ్లికి హాజరైన వాళ్ల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక లోని చిక్ మగళూరు జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 17యేళ్ల బాలుడు, బెంగళూరుకు చెందిన 20 యేళ్ల యువతితో పరిచయం అయ్యింది. ఆమె బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. రోజూ ఆ బాలుడితో ఆమె చాట్ చేసేది.

వీడియో కాల్స్ మాట్లాడేది. ఈ క్రమంలోనే ఓ రోజు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని అడిగింది. అప్పటికే యువతితో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ తో మాయలో పడ్డ ఆ బాలుడు సరేనన్నాడు. అంతే ఇంట్లో వాళ్లకు చెప్పా పెట్టకుండా ఆమె అతడి ఊరికి వచ్చింది. 

ఆ బాలుడి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా ఆమె అతడిని వెంటబెట్టుకుని ఓ గుడికి వెళ్లింది. ఆ బాలుడి కొందరు స్నేహితులు, బంధువుల సమక్షంలో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఈ వార్త కాస్తా ఆ గ్రామంలో తెలిసిపోయింది. దీంతో మైనర్ ను ఓ యువతి పెట్టాడిందన్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. 

వెంటనే పోలీసులు ఆ గ్రామానికి వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ యువతిని అదుపులోకి తీసుకున్నాం.. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లిని జరిపించిన వారితో పాటు.. ఆ యువతి మీద కూడా కేసు నమోదు చేశాం అని పోలీసులు తెలిపారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios