Ballia: ఒక మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి, నెల‌లుగా అత్యాచారానికి పాల్ప‌డిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని బ‌ల్లియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు.  

19-Year-Old Man Kidnaps, Rapes Minor: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌రో దార‌ణం చోటుచేసుకుంది. ఒక మైన‌ర్ బాలిక‌ను కిడ్నాప్ చేసి, నెల‌లుగా అత్యాచారానికి పాల్ప‌డిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న బ‌ల్లియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌నపై కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. యూపీలోని బ‌ల్లియాలో 15 ఏళ్ల బాలికను అపహరించి నెలన్నర పాటు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తన గ్రామం నుంచి మైనర్ బాలిక అదృశ్యమైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మరుసటి రోజు కేసు నమోదు చేశారు. ఆగస్టు 26న మైనర్ బాలికను డియోరియా నుంచి రక్షించామని, ఆమె మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిందని, బీహార్ లోని సివాన్ జిల్లాకు చెందిన రాహుల్ కుమార్ సింగ్ (19) తనను కిడ్నాప్ చేసిన తర్వాత డియోరియాకు తీసుకెళ్లాడని బాలిక తన వాంగ్మూలంలో ఆరోపించినట్లు ఎస్ హెచ్ వో రాజీవ్ సింగ్ తెలిపారు. ఆమెను బంధించి సుమారు నెలన్నర పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని సోమవారం స్టేషన్ క్రాసింగ్ సమీపంలో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

యూపీలో అంత‌కుముందు, ఈ యేడాది మే నెల‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ గ్రామంలో 15 ఏళ్ల తొమ్మిదో తరగతి బాలికను ముగ్గురు మైనర్లు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంత‌రం నిందితులు పరారీలోకి వెళ్లారు. వారి స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించిన‌ట్టు అధికారులు తెలిపారు. బాలిక మేనమామ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, బాధితురాలు తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆవు పేడను పారవేయడానికి తన ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. నిందితుడు బాలికను బలవంతంగా గ్రామంలోని పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

సుమారు రెండు గంటలు గడిచినా బాలిక రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పాడుబడిన ఇంట్లో అర్ధ స్పృహలో ఉన్న బాలిక కనిపించింది. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లామనీ, అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో బులంద్ షహర్ లోని జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశామని తెలిపారు. నిందితుల్లో ఇద్దరు ఒకే గ్రామంలో నివసిస్తుండగా, ఒకరు సమీప ప్రాంతానికి చెందినవారని బాధిత కుటుంబం స‌భ్యులు తెలిపారు.