Asianet News TeluguAsianet News Telugu

19యేళ్ల యువతిపై సామూహిక అత్యాచారం.. బర్త్ డే పార్టీకి వెడితే, మత్తుపానీయం ఇచ్చి దారుణం...

బర్త్ డే పార్టీకి వెళ్లిన ఓ యువతికి మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చి.. ఆమె మీద సామూహిక అత్యాచారానికి పాల్పడిని ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

19-Year-Old Given Spiked Drink, Gang Raped After Birthday Party in Uttar Pradesh
Author
Hyderabad, First Published Aug 17, 2022, 10:03 AM IST

ఘజియాబాద్ : ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బర్త్ డే పార్టీకి వచ్చిన యువతికి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి.. ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన గురించిన వివరాలను పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఘజియాబాద్ జిల్లాలోని మోడీ నగర్ పట్టణంలో 19 ఏళ్ల యువతి బర్త్ డే పార్టీ కి వెళ్లింది. ఆమె మీద పార్టీ అనంతరం ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న బాధిత మహిళ ఆదివారం పార్టీకి హాజరయ్యింది. అక్కడ ఆమెకు ఎవరో మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తరువాత, ఒక వ్యక్తి ఆమెను ఒక గదికి తీసుకెళ్లాడు. ఆ తరువాత తన స్నేహితులను కూడా పిలిచాడు. వారంతా కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఆమె స్పృహలోకి వచ్చి...వారితో పోరాడేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నిందితులు ఆ యువతిని కొట్టి, జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. ఆ తరువాత వారు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు.

ప్రాణాలతో బయటపడిన యువతి ఇంటికి చేరుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాన్ని వివరించింది. సోమవారం ఆమె తన తండ్రితో కలిసి మోడీ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ ఘటనపై పోలీసు కేసు పెట్టింది. పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం పంపగా, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. శేఖర్, కృష్ణ, అర్జున్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఇరాజ్ రాజా తెలిపారు.

పశ్చిమబెంగాల్ లో దారుణం.. చెత్తకుండీలో పదిహేడు పిండాలు..!

ఇదిలా ఉండగా, హర్యానాలోని పానిపట్‌లో ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేసిన ఆరోపణలపై 40 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. 6 ఏళ్ల బాలిక పానిపట్‌లోని తన ఇంటి దగ్గరున్న పార్కులో తన కంటే రెండేళ్లు చిన్నవాడైన తన తమ్ముడితో కలిసి ఆడుకుంటున్నప్పుడు సోమవారం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

ఆమెను పార్కు నుంచి కిడ్నాప్ చేసిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని ఉత్తరాఖండ్‌కు చెందిన ఈశ్వర్‌గా గుర్తించామని, అతను పానిపట్‌లో ఉంటూ ధాబాలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పానిపట్‌లో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. అత్యాచారం తరువాత.. చిన్నారిని గొంతుకోసి హత్య చేసినట్లు.. పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు.

కాగా, బాలిక కనిపించడం లేదని చిన్నారి కుటుంబసభ్యుల నుంచి ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక ఇంటి సమీపంలోని ఫ్యాక్టరీల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని నిందితుడు కిడ్నాప్ చేసి.. తీసుకెళ్లినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఫుటేజ్ ఆధారంగా అతడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని సోమవారం సాయంత్రం పానిపట్‌లోని సెక్టార్ 25లోని జింఖానా క్లబ్ సమీపంలో అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios