Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం: 12 మంది మృతి, ఏడుగురికి గాయాలు

రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ లో మంగళవారంనాడు  ఘోర ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఏడుగురు మరణించారు.

12 killed in roiad accident in Rajasthan
Author
New Delhi, First Published Aug 31, 2021, 9:24 AM IST

జైపూర్: రాజస్థాన్  రాష్ట్రంలో ని బికనీర్ లో  మంగళవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.మృతులంతా దౌలత్ పూర్ కు చెందినవారుగా గుర్తించారు. 

 

బికనీర్- జోథ్‌పూర్ హైవేపై నోఖా నాగౌర్ మధ్య బాలాజీ అనే గ్రామం వద్ద మంగళవారం నాడు ఉదయం బస్సు క్రూయిజర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలోనే ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios