Asianet News TeluguAsianet News Telugu

మోదీ మళ్లీ ప్రధాని కావాలంటూ గేదెకు పూజలు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి. కాగా... మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా... అధికారం కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది.

man offers prayers buffalo for modi to become PM again
Author
Hyderabad, First Published May 19, 2019, 10:20 AM IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన విడుదల కానున్నాయి. కాగా... మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా... అధికారం కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉంటే... మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ తమిళనాడులో ఓ వ్యక్తి గేదెలతో యాగం, పూజలు నిర్వహించాడు. తూత్తుకూడి జిల్లా వల్లనాడులో నారాయణన్‌ అనే వ్యక్తి గోశాలను నిర్వహిస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ప్రార్థిస్తూ ఈ గోశాలలో ఇటీవల రహస్యంగా ప్రత్యేక యాగం నిర్వహించారు. 

గోశాలలోని 21 గేదెలకు 15 మంది వేదపండితులు నాలుగుగంటలపాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఒక గేదె కాలికి బంగారు గొలుసు అలంకరించి ప్రత్యేక యాగం నిర్వహించారు. గోప్యంగా జరిగిన ఈ యాగానికి మోదీ ప్రతినిధిగా హాజరైన వ్యక్తి మాత్రమే ఫొటోలు తీయగా, మిగిలిన ఎవ్వరూ సెల్‌ఫోన్‌ తీసుకురాకుండా కట్టుదిట్టం చేశారని సమాచారం.   

Follow Us:
Download App:
  • android
  • ios