లోక్ సభ ఎన్నికల బరిలో హీరోయిన్ నిషా
త్వరలో జరగనున్న ఎన్నికల బరిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది సీన నటులు పోటీ చేస్తున్నారు. కాగా.. తాజాగా మరో హీరోయిన్ పేరు ప్రముఖంగా వినపడుతోంది.
త్వరలో జరగనున్న ఎన్నికల బరిలో ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా మంది సీన నటులు పోటీ చేస్తున్నారు. కాగా.. తాజాగా మరో హీరోయిన్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ప్రముఖ మోడల్, సినీ నటి నిషా యోగేశ్వర్కు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు తగ్గట్టుగా బీజేపీ తొలి జాబితాలో బెంగళూరు గ్రామీణ నియోజవకర్గానికి అభ్యర్థి పేరును పెండింగ్లో ఉంచారు. నటుడు మాజీమంత్రి సి.పి.యోగేశ్వర్ పేరును రాష్ట్ర పార్టీ నేతలు అధిష్ఠానానికి సిఫారసు చేశారు. అయితే.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
దీంతో.. తనకు వచ్చిన అవకాశాన్ని తన కుమార్తె నిషా యోగేశ్వర్ కి ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో.. ఆమెకు టికెట్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 29ఏళ్ళ నిషాకు రాజకీయాలు కొత్తేమీ కాదు. చెన్నపట్టణంలో తన తండ్రి సి.పి.యోగేశ్వర్ తరపున ఇంటింటికీ వెళ్ళి ఓట్లను అభ్యర్థించి ప్రచారం చేశారు. నిజానికి 2018 శాసనసభ ఎన్నికలలోనే చెన్నపట్టణ నుంచి నిషా పేరు తెరపైకి వచ్చింది.
మోడలింగ్లో పేరు ప్రఖ్యాతులు గడించి ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నిషా అమెరికాలో ఎం.ఎస్.చదివింది. ప్రస్తుతం మోడల్ గాను, నటిగానూ బిజీగా ఉంటూనే తండ్రికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు చూసుకుంటోంది. ఒకవేళ బెంగళూరు గ్రామీణ నుంచి నిషా బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ నియోజకవర్గానికి పోటీ చేసిన తొలి మహిళగా అరుదైన ఖ్యాతిని తన సొంతం చేసుకోవడం ఖాయం.