ఆమేథీలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం నాడు ఆమేథీ ఎంపీ స్థానంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాహుల్తో పాటు ఆయన సోదరి ప్రియాంకగాంధీ కూడ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
లక్నో: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం నాడు ఆమేథీ ఎంపీ స్థానంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రాహుల్తో పాటు ఆయన సోదరి ప్రియాంకగాంధీ కూడ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానం నుండి కూడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుండి రాహుల్ గాంధీ తన సోదరితో కలిసి వారం రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు.
గాంధీల కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆమేథీలో మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే ఈ దఫా రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ నుండి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీకి దిగుతున్నారు. రాహుల్ నామినేషన్ దాఖలు చేసే సమయంలో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. 2014 ఎన్నికల్లో కూడ రాహుల్గాంధీపై స్మృతి ఇరానీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఆమేథీ స్థానం నుండి రాహుల్ గాంధీ మూడు దఫాలు ఎంపీగా విజయం సాధించారు.