రాబర్ట్ వాద్రాకు చేదు అనుభవం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం వాద్రా.. దక్షిణ ముంబయిలోని ముంబా దేవి ఆలయానికి అమ్మవారి దర్శనానికి వెళ్లారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం వాద్రా.. దక్షిణ ముంబయిలోని ముంబా దేవి ఆలయానికి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. కాగా... ఆలయంలో ఆయనను చూసిన పలువురు భక్తులు ప్రధాని నరేంద్రమోదీ పేరుతో గట్టిగా నినాదాలు చేశారు.
టెంపుల్లోకి రాబర్ట్ వాద్రా అడుగుపెట్టగానే ''మోదీ జిందాబాద్, భారత్ మాతా కీ జై'' అంటూ గట్టిగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆలయానికి పోలీసులు వచ్చి ఆయనను సురక్షితంగా బయటకు పంపించి వేశారు.
ఈ సందర్భంగా వాద్రా మాట్లాడుతూ.. దేవీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడి వచ్చాను. ఆలయంలో రాజకీయాలు చేయడానికి రాలేదు. కుటుంబసభ్యులతో ఇక్కడి వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆలయంలో రాజకీయ కార్యకలపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్వహించకుడదని ఆయన పేర్కొన్నారు.
ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విహారయాత్రకు ఉపయోగించారని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి రాజకీయాలు దిగజారిపోయానని వాద్రా పేర్కొన్నారు.