ఎప్పుడు ఎవరికీ ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆనందంగా సాగిపోతున్న కొన్ని జీవితాలు ఒక్కసారిగా రోడ్డున పడి ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా కుటుంబ పెద్దలు ఇంటికి చేదోడు వాదోడుగా ఉన్న వాళ్లు కాస్త కొన్ని కారణాల వల్ల దూరమైతే ఆ కుటుంబం రోడ్డున పడి అష్ట కష్టాలను అనుభవిస్తుంటారు. అలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నారు మెదక్ కి చెందిన మున్ని. చిన్న వయసులోనే పెళ్లి ఆ తర్వాత నలుగురు పిల్లలు పిల్లలు పుట్టిన వెంటనే భర్త మరణం ఆమెను జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం తన నలుగురు పిల్లలతో జీవితంతో పోరాటం చేస్తున్న మున్ని కన్నీటి కథ ఇదే.
ఎప్పుడు ఎవరికీ ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆనందంగా సాగిపోతున్న కొన్ని జీవితాలు ఒక్కసారిగా రోడ్డున పడి ఊహించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలా కుటుంబ పెద్దలు ఇంటికి చేదోడు వాదోడుగా ఉన్న వాళ్లు కాస్త కొన్ని కారణాల వల్ల దూరమైతే ఆ కుటుంబం రోడ్డున పడి అష్ట కష్టాలను అనుభవిస్తుంటారు. అలాంటి కష్టాన్ని అనుభవిస్తున్నారు మెదక్ కి చెందిన మున్ని. చిన్న వయసులోనే పెళ్లి ఆ తర్వాత నలుగురు పిల్లలు పిల్లలు పుట్టిన వెంటనే భర్త మరణం ఆమెను జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి. ప్రస్తుతం తన నలుగురు పిల్లలతో జీవితంతో పోరాటం చేస్తున్న మున్ని కన్నీటి కథ ఇదే.
మెదక్ జిల్లాలోని రామయంపేట మండలం ధర్మారందొంగల గ్రామానికి చెందిన మున్నీకి అతి చిన్న వయసులోనే జాఫర్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరి పెళ్లయిన 11 సంవత్సరాల వ్యవధిలోనే నలుగురు పిల్లలు పుట్టారు. ఇక జాఫర్ మటన్ కొట్టు పెట్టుకొని కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.అయితే ఉన్నఫలంగా జాఫర్ మృతి చెందడంతో మున్ని తన నలుగురు పిల్లలు అత్తమామలతో కలిసి ఉంటుంది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి భర్త చనిపోవడంతో పిల్లల పోషణ భారమైన ఈమె గ్రామస్తుల సహకారంతో 20 సంవత్సరాల నుంచి మటన్ కొట్టు నడుపుతూ జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తున్నారు.
ఈ విధంగా తన గ్రామంలోనే మటన్ కొట్టు పెట్టుకున్న మున్ని గ్రామస్తులందరూ కూడా తన వద్ద మటన్ కొట్టు తనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.ఇలా గ్రామస్తులు అందరూ తనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నప్పటికీ తన బంధువులే తనని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఈమె వాపోయింది. అయితే మటన్ కొట్టు వల్ల ఒకరోజు వ్యాపారం జరుగుతుంది మరొక రోజు జరగదు. ఈ విధంగా వచ్చిరాని ఆదాయంతో ఈమె తన నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఇక మటన్ షాప్ పెట్టని సమయంలో ఈమె బీడీలు చుడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు.
20 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్న మున్ని పెద్దగా ఆస్తుపాసులు కూడా లేవని కనీసం తనకు ఉండటానికి కూడా సొంత ఇల్లు లేదని బాధపడ్డారు. ప్రభుత్వం దయతలచి తనకు ఇల్లు మంజూరు చేస్తే అదే అదృష్టమని ప్రస్తుతం తన కొడుకులు కూడా చేతికి వచ్చారని,తన కుటుంబం కోసం వారు కూడా తనకు చేదోడు వాదోడుగా ఉంటారని భావిస్తున్నాను అంటూ మున్ని తన కన్నీటి కష్టాలను తెలిపారు. ఈ విధంగా చిన్న వయసులోనే భర్త మరణించడంతో నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసిన ఈమె కన్నీటి గాధ తెలిస్తే నిజంగానే గుండె బరువెక్కుతుంది.
