Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో ఉన్న టాప్ 10 అతిపెద్ద మసీదులు ఇవే..!

ఇండియాలో 300,000 కు పైగా మసీదులు ఉన్నాయి. వాటిలో ఎన్నో శిథిలావస్తకు చేరుకుంటే.. మరికొన్ని కనుమరుగై పోయాయి. ప్రస్తుతం భారత దేశంలో లక్షకు పైగా మసీదులు ఉన్నాయి. వీటిలో అతిపెద్ద మసీదుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

10 Largest Mosques In India
Author
First Published Aug 8, 2022, 1:06 PM IST

1. జామా మసీదు - న్యూఢిల్లీ

భారతదేశంలోని జామా మసీదు.. ప్రపంచంలోని ఎంతో ప్రసిద్ధి చెందిన మసీదులలో ఒకటి. దీనిని 1956లో షాజహాన్ నిర్మించారు.  ఈ భవనం 25,000 మందికి వసతి కల్పిస్తుంది. ఎర్ర ఇసుకరాయి, పాలరాయితో తయారు చేసిన ఈ మినార్ 135 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మసీదుగా పేరు సంపాదించుకుంది. 

2. మక్కా మసీదు- హైదరాబాద్

భారతదేశంలోని పురాతన, అతిపెద్ద మసీదులలో ఒకటైన మక్కా మసీదును 1694 లో  నిర్మించారు. దీన్ని మక్కా నుంచి ఎగుమతి చేయబడిన మట్టి , ఇటుకలతో నిర్మించారు. 75 అడుగుల ఎత్తైన ఈ మసీదులో ఒకేసారి 10,000 మందికి వసతి కల్పించే సామర్థ్యం ఉంది.

3. తాజ్-ఉల్-మసాజిద్ - భోపాల్

భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో తాజ్- ఉల్-మసాజిద్ ఒకటి. దీనిని "మసీదుల కిరీటం" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద మసీదులలో ఒకటిగా గుర్తింపు పొందింది.

4. జామియా మసీదు- శ్రీనగర్

జామియా మసీదు భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటి. ఇది శ్రీనగర్ లో ఉంది. ఈ మసీదులో ఒకేసారి 33,000 మందికి వసతి పొందొచ్చు. ఇది భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో మొదటి ఐదు స్థానాల్లో ఉంది.

5. బారా ఇమాంబరా- లక్నో

ఈ బారా ఇమాంబరా మసీదును 1784 లో అవధ్ నవాబు నిర్మించారు. ఈ మసీదులో ఒకే సమయంలో 300,000 మందికి పైగా ప్రజలు ప్రార్థనలు చేసుకోవచ్చు.  

పురాణాల ప్రకారం.. ఈ మసీదు క్రింద ఉన్న సొరంగం గోమతి నదికి లేదా ఫైజాబాద్, అలహాబాద్, ఢిల్లీ వంటి ప్రదేశాలకు కూడా దారితీస్తుంది. కానీ వాటి నుంచి వెళ్లడానికి అనుమతి లేదు.

6. చోటా ఇమాంబర- లక్నో

బారా ఇమాంబరా సమీపంలోనే చోటా ఇమాంబరా ఉంది. దీనిని 1838 లో నిర్మించారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో కూడా ఒకటి. అవధ్ మూడవ నవాబు అతని తల్లి జ్ఞాపకార్థం, ఖననం చేయడానికి ఈ మసీదు నిర్మించాడు. 

7. జామా మసీదు - భిలాయ్

భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో జామా మసీదు ఒకటి.  చత్తీస్ గఢ్ లోని భిలాయ్, అరబిక్ లిపిలో "యా అల్లాహ్" ఆకారంలో నిర్మించిన ప్రపంచంలోని మొట్టమొదటి మసీదు ఇది.

8. నగీనా మసీదు- ఆగ్రా

ఈ మసీదును "జెమ్ మసీదు" అని కూడా పిలుస్తారు. షాజహాన్ నిర్మించిన ఆగ్రా కోటలో మూడు గోపురాలు, గంభీరమైన తోరణాలతో రాజకుటుంబాలకు చెందిన మహిళల కోసం నిర్మించారు.

9. జామా మసీదు - ఆగ్రా

జామీ మసీదుగా ప్రసిద్ధి చెందిన దీనిని షాజహాన్ తన కుమార్తె జహనారా బేగం కోసం నిర్మించారు. భారతదేశంలోని అతి పెద్ద మసీదులలో ఒకటైన ఈ మసీదులో  ఒకే సమయంలో 10,000 మంది ప్రార్థనలు చేసుకోవచ్చు. 

10. హాజీ అలీ దర్గా - ముంబై

ముంబైలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మసీదు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మసీదులలో ఒకటి.  ఈ మసీదు ఒక ద్వీపంలో నిర్మించబడింది. ఇది ముంబైలోని వర్లీ తీరానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios