Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... మూడు లారీలు, ఓ బస్సు ఢీ

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఓ బస్సు, మూడు లారీలు ఒకదాన్ని మరొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  

road accident at karimnagar
Author
Karimnagar, First Published Nov 15, 2019, 6:11 PM IST

కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇరుకుల్ల వద్ద మూడు లారీలు ఓ ఆర్టీసి బస్సు ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా వున్నా ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. 

ఇరుకుల్ల వద్ద మొదట వేగంగా వెళుతున్న లారీ ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో వాటి వెనకాల వున్న మరో రెండు లారీలు కూడా అదుపుతప్పి ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఇలా మూడు లారీలు, బస్సు ప్రమాదానికి గురయ్యాయి. 

"

అయితే బస్సులోని ప్రయాణికులకు గానీ, లారీల్లోని వారికి గానీ ఎలాంటి పెద్ద గాయాలు కాలేవు. చాలామంది సురక్షితంగా బయటపడగా  కొందరికి మాత్రం స్వల్పంగా గాయలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 

video news : రాజీవ్ రహదారిపై ప్రమాదం, ఇద్దరు మృతి

ఈ  ప్రమాదం కారణంగా రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మొదట గాయపడినవారిని ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేశారు. అనంతరం వాహనాలకు రోడ్డుపైనుండి పక్కకు జరిపి ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

read more  భర్త మాజీ భార్యను గేలిచేసిన మహిళ... అరెస్ట్

ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని ప్రత్యక్షసాక్షులు, ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి  ప్రాణనష్టం జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

ఇదే కరీంనగర్ జిల్లాలో ఇవాళ ఉదయం కూడా ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అలుగునూరు సమీపంలో రాజీవ్ రహదారిపై లారీ, బైక్  లు ఢీకొన్నాయి.  మితిమీరిన వేగంతో వచ్చిన బైక్ లారీని ఢీకొన్నాయి. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ కరీంనగర్ పట్టణానికి చెందిన సాయి కిరణ్(20), సాయి కృష్ణ(22) గా గుర్తించారు. 
 


 

Follow Us:
Download App:
  • android
  • ios