CBSEలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు నోటిఫికేశాన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

సరైన అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపికలు చేస్తారు.
వివిధ పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సెక్రటరీ, అనలిస్ట్ (ఐటీ), జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష(సీబీటీ) ద్వారా నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.11.2019.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 16.12.2019.
