Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 7న క్లాట్-2020 పరీక్ష.. త్వ‌ర‌లో అడ్మిట్ కార్డులు..

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను సమీక్షించడానికి, సి‌ఎల్‌ఏ‌టి 2020 పరీక్షను నిర్వహించడానికి తేదీలను జనరల్ బాడీ ఆఫ్ ది కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీలు సోమవారం సమావేశమయ్యాయి. 

Consortium of National Law Universities on Monday released the Common Law Admission Test (CLAT) 2020 date
Author
Hyderabad, First Published Aug 13, 2020, 2:41 PM IST

న్యూఢిల్లీ: ‌జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం సోమవారం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (సి‌ఎల్‌ఏ‌టి) 2020 తేదీని విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం, సి‌ఎల్‌ఏ‌టి 2020 సెప్టెంబర్ 7, 2020 న నిర్వహించనున్నరు.

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను సమీక్షించడానికి, సి‌ఎల్‌ఏ‌టి 2020 పరీక్షను నిర్వహించడానికి తేదీలను జనరల్ బాడీ ఆఫ్ ది కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీలు సోమవారం సమావేశమయ్యాయి.

ఈ సమావేశంలో జనరల్ బాడీ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్థితిని, ఈ పరీక్ష నిర్వహించడానికి అవసరమైన ఆరోగ్య, భద్రతా ప్రోటోకాల్లను అంచనా వేసింది.

దేశంలోని 22 న్యాయ విశ్వ‌విద్యాల‌య్యాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే క్లాట్-2020 తేదీని లా వ‌ర్సి‌టీల కాన్సార్షియం ప్ర‌క‌టించింది. సెప్టెంబ‌ర్ 7న మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌) జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది.

also read గేట్‌-2021లో మార్పులు.. కొత్త‌గా క్వ‌శ్చన్స్‌ పేపర్ లో మ‌రో సెక్ష‌న్‌.. ...

అడ్మిట్ కార్డుల‌ను రెండు వారాల్లో విడుద‌ల చేస్తామ‌ని తెలిపింది. అడ్మిట్ కార్డ‌ల‌ను అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.in/clat-2020/ ‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. 

షెడ్యూల్ ప్ర‌కారం ఈ ప‌రీక్ష మే 24న జ‌ర‌గాల్సి ఉంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో జూన్ 21కి, అనంత‌రం ఆగ‌స్టు 22కు వాయిదావేశారు. అయితే దేశంలో క‌రోనా కేసులు పెరిగిపోతుండ‌టంతో మ‌రోమారు ప‌రీక్ష వాయిదాప‌డింది. దీంతో మ‌ళ్లీ ప‌రీక్ష తేదీని ప్ర‌క‌టించారు. క్లాట్‌-2020కి సుమారు 68 వేల మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. 

క్లాట్ యూజీ ప‌రీక్ష 150 మార్కుల‌కు జ‌రుగుతుంది. ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక్క మార్కు చొప్పున మొత్తం 150 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. అదేవిధంగా పీజీ ప‌రీక్ష‌లో 120 బ‌హుళైచ్చిక ప్ర‌శ్న‌లు, 120 మార్కుల‌కు ఉంటాయి. అయితే త‌ప్పు స‌మాధానాల‌కు మార్కులు కోత‌విధిస్తారు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 0.25 మార్క‌లు క‌ట్ చేస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios