Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు చిన్నారుల శవాలతో.. నెలలపాటు కారులో ప్రయాణం..!

ఏడేళ్ల మేనకోడలిని చంపేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో నింపి.. ఓ ట్రక్కులో పెట్టింది. సంవత్సరం తర్వాత.. ఆ బాలిక మృతదేహం పక్కనే.. బాలుడిని కూడా చంపేసి మరో ప్లాస్టిక్ సంచిలో పెట్టింది.

Woman Drives For Months In US With Two Dead Children In Car; Arrested
Author
Hyderabad, First Published Jul 31, 2021, 9:04 AM IST

ఓ మహిళ ఇద్దరు చిన్నారుల శవాలను కారులో పెట్టుకొని కొన్ని నెలలపాటు కారులో తిరుగుతూనే ఉంది. కాగా.. తాజాగా పోలీసులకు చిక్కడంతో... ఆమెను అరెస్టు చేశారు. సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తుండగా.. నిందితురాలు పోలీసులకు చిక్కడం గమనార్హం. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పు తీర నగరం బాల్టిమోర్ కు చెందిన నికోల్ జాన్సన్(33).. తన ఏడేళ్ల మేనకోడలు, ఐదేళ్ల మేనల్లుడు మరణానికి కారణమైంది. ఏడేళ్ల మేనకోడలిని చంపేసి.. మృతదేహాన్ని సూట్ కేసులో నింపి.. ఓ ట్రక్కులో పెట్టింది. సంవత్సరం తర్వాత.. ఆ బాలిక మృతదేహం పక్కనే.. బాలుడిని కూడా చంపేసి మరో ప్లాస్టిక్ సంచిలో పెట్టింది.

ఇద్దరి శవాలను కారులో తన వెంటే ఉంచుకొని.. సిటీలో తిరుగుతూ ఉంది. అయితే.. ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. ఆమె వద్ద సరైన పేపర్స్ లేవని కారును జప్తు చేశారు. ఈ క్రమంలో కారు చెక్ చేయగా.. ఆమె చేసిన అసలు నేరం భయటపడింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చంపింది అనే విషయం మాత్రం తెలియలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios