Asianet News TeluguAsianet News Telugu

చరిత్ర సృష్టించిన వర్జిన్ గెలాక్టిక్ : 90 నిమిషాల రోదసీ యాత్ర.. విజయవంతంగా భూమిని చేరిన వ్యోమనౌక

వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. 90 నిమిషాల పాటు రోదసిలో ప్రయాణించి ఈ నౌక తిరిగి భూమిని చేరుకుంది. రోదసీలో ప్రయాణించిన నాలుగో భారతీయ వ్యోమగామిగా తెలుగమ్మాయి శిరీష బండ్ల రికార్డుల్లోకెక్కారు. 

Virgin Galactic space flight return to Earth after historic space flight ksp
Author
New Mexico, First Published Jul 11, 2021, 9:23 PM IST

వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్షయాత్ర విజయవంతమైంది. 90 నిమిషాల పాటు రోదసిలో ప్రయాణించి ఈ నౌక తిరిగి భూమిని చేరుకుంది. రోదసీలో ప్రయాణించిన నాలుగో భారతీయ వ్యోమగామిగా తెలుగమ్మాయి శిరీష బండ్ల రికార్డుల్లోకెక్కారు. అంతకుముందు గంటన్నర ఆలస్యంగా వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక నింగీలోకి దూసుకెళ్లింది. న్యూమెక్సికో నుంచి వీఎస్ఎస్ యూనిటీ-22 ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌకలో తెలుగమ్మాయి శిరీష బండ్ల సహా ఆరుగురు వున్నారు. 90 నిమిషాల పాటు ఈ బృందం అంతరిక్షయానం చేశారు.

Also Read:అంతరిక్షయానంలో నూతన శకం: నింగిలోకి దూసుకెళ్లిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష పేరేంట్స్ చాలా క్రితం అమెరికాలో స్థిరపడ్డారు. ఈ వ్యోమ నౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ తో పాటు మరో అయిదుగురు ప్రయాణం చేశారు. ఇందులో శిరీష బండ్ల ఉన్నారు. ఈ యాత్రపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అంతకుముందు రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ రోదసీలోకి వెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios