Asianet News TeluguAsianet News Telugu

ఇంట్లో నిధి... తవ్వి చూస్తే 264బంగారు నాణేలు...!

ఇటీవల ఆ ఇంటిని రీ మోడలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో... వారికి ఊహించని విధంగా నిధి కనపడింది. వాళ్లు ఉంటున్న ఇంట్లోని కిచెన్ గదిలో తవ్వుతుండగా ఈ నాణేలు బయటపడటం గమనార్హం.

Uk Couple Find Gold Coins At her home Worth rs.2.3 crores
Author
First Published Sep 3, 2022, 10:38 AM IST

ఇల్లు రీమోడలింగ్ చేపిస్తుంటే.. అనూహ్యంగా మీ ఇంట్లో బంగారు నిధి ఒకటి బయటపడితే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది..? ఓ దంపతుల విషయంలో అదే జరిగింది. యూకేకి చెందిన ఓ జంట ఇల్లు రీ మోడలింగ్ చేపిస్తుంటే.. వారి ఇంట్లోకిచెన్ గదిలో 264 బంగారు నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ దాదాపు రూ.2.3 కోట్లు కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.... యూకేకి చెందిన ఓ జంట పదేళ్ల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఇటీవల ఆ ఇంటిని రీ మోడలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో... వారికి ఊహించని విధంగా నిధి కనపడింది. వాళ్లు ఉంటున్న ఇంట్లోని కిచెన్ గదిలో తవ్వుతుండగా ఈ నాణేలు బయటపడటం గమనార్హం. ఈ నాణేలు 400ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్నారు. నార్త్ యార్క్ షైర్ కు చెందిన ఈ జంట... ఈ నాణేలను త్వరలోనే విక్రయించాలని అనుకుంటన్నారట. భారత కరెన్సీలో వీటి విలువ రూ.2.3 కోట్లు గా తేలింది. దీంతో... ఈ జంట ఇప్పుడు ఆనందంలో తేలిపోతోంది.

తాము ఇదే ఇంట్లో గత పదేళ్లుగా ఉంటున్నామని... ఇలా అదృష్టం కలిసొస్తుందని తాము అనుకోలేదని వారు చెప్పారు. అయితే.. సదరు దంపతులు తమ పేర్లు బయటకు చెప్పడానికి నిరాకరించడం గమనార్హం. ఇల్లు పాతగా మారిందని... ఆధునీకరిద్దామని ఆ పనులు చేస్తుండగా.. లక్ష్మీదేవి కాటక్షం లభించిందని వారు చెప్పారు.

కిచెన్ లో తవ్వుతున్న సమయంలో గట్టిగా తగలడంతో ఏదైనా విద్యుత్ వైర్ల పైపు అయ్యుంటుందని ఆ దంపతులు భావించారు. మరికాస్త తవ్వగా, ఓ లోహపు క్యాన్ కనిపించింది. దాంట్లో బంగారు నాణేలు ఉండడంతో ఆ జంట ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.  ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. ఎవరైనా వ్యాపారి కుటుంబం గతంలో ఇక్కడ నివసించి ఉండవచ్చని అక్కడి మీడియా పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios