Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్‌లో హిందూ బాలికల కిడ్నాప్ కలకలం..ఎఫ్‌ఐఆర్ నమోదుకు నిరాకరణ.. ఆందోళన చేపట్టిన బాధితులు

పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఇద్దరు మైనర్ హిందూ బాలికలు అపహరణకు గురయ్యారు. ఆ నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమపై కూడా దాడికి పాల్పడ్డారని బాధిత బాలికల తల్లులు తెలిపారు. ఈ ఘటనలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో నిస్సహాయులైన బాలికల తల్లులు బుధవారం నిరసనకు దిగారు. కోర్టును ఆశ్రయించారు. 
 

Two Hindu Girls Abducted In Pakistan Sindh Province
Author
First Published Oct 20, 2022, 5:26 AM IST

పాకిస్థాన్‌లో హిందూ బాలికల కిడ్నాప్ కలకలం రేగింది. సింధ్ ప్రావిన్స్‌లో ఇద్దరు మైనర్ హిందూ బాలికలు అపహరణకు గురయ్యారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారని సమాచారం. దీంతో ఆ బాలికల తల్లులు  బుధవారం నిరసన ప్రదర్శనలు చేసింది. సుక్కూర్ సమీపంలోని సలా పాట్ ప్రాంతంలో గత వారం తన కూతుళ్లతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని అపహరణకు గురైన బాలికల తల్లి పేర్కొంది.

తన ఇద్దరు మైనార్  కుమార్తెలను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించారని, వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు తనపై దాడి చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో నిస్సహాయులైన బాలికల తల్లులు బుధవారం నిరసనకు దిగారు. తమ కుమార్తెలను కిడ్నాప్ చేసిన ముసుగు ధరించిన దుండగులపై ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు ఏమీ చేయడం లేదని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కుమార్తెలను తిరిగి తీసుకురావాలని కోర్టును ఆశ్రయిస్తున్నాను.

హిందూ యువతుల అపహరణ, బలవంతంగా మతమార్పిడి చేయడం సింధ్ ప్రావిన్స్‌లోని అంతర్భాగంలో పెద్ద సమస్యగా మారింది. సింధ్ ప్రావిన్స్‌లోని థార్,ఉమర్‌కోట్, మిర్‌పుర్‌ఖాస్,ఘోట్కీ, ఖైర్‌పూర్ ప్రాంతాలలో ఎక్కువ మంది హిందూ జనాభా ఉన్నారు. హిందూ సమాజంలోని చాలా మంది సభ్యులు కార్మికులు. ఈ నెలలో సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ నగరానికి చెందిన 14 ఏళ్ల హిందూ బాలిక అపహరణకు గురైనట్లు వచ్చిన నివేదికలపై పాకిస్తాన్ సింధ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.

గత నెలలో హిందూ వర్గానికి చెందిన మహిళ,ఇద్దరు మైనర్ బాలికలను అపహరించి, వారిలో ఇద్దరిని బలవంతంగా మతమార్పిడి చేసి ముస్లిం పురుషులతో వివాహం జరిపించారు. జులై 16, 2019న సింధ్ ప్రావిన్స్‌లోని వివిధ జిల్లాల్లో హిందూ బాలికల అపహరణ, బలవంతంగా మతమార్పిడికి సంబంధించిన అంశం సింధ్ అసెంబ్లీలో లేవనెత్తబడింది. ఇక్కడ ఒక తీర్మానం చర్చకు వచ్చింది.

కొంతమంది ఎంపీల అభ్యంతరాలపై సవరించిన తర్వాత ఏకగ్రీవంగా ఆమోదించబడింది. హిందూ బాలికలకు మాత్రమే. కానీ బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని నేరంగా ప్రకటించే బిల్లు ఆ తర్వాత అసెంబ్లీలో తిరస్కరించబడింది. మళ్లీ ఇదే బిల్లును ప్రతిపాదించినా గతేడాది తిరస్కరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios