Asianet News TeluguAsianet News Telugu

బహరేన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కి, రాష్ట్ర ప్రజలకు ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ తరుపున 4వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపింది. 

Telangana formation day celebrations in Bahrain

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కి, రాష్ట్ర ప్రజలకు ఎన్నారై టిఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ తరుపున 4వ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపింది. తెలంగాణ ప్రజలందరి సహకారాం వల్లే మన స్వరాష్ట్రం కల సాకారమైందని ఎన్నారై టిఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ బోలిశెట్టి వెంకటేష్ లు అన్నారు. 

తెలంగాణ రాష్ట్రం నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ముందుగా తెలంగాణ అమరవీరులకు క్రొవ్వొత్తులు వెలిగించి, పూలతో నివాళులు అర్పించి, వారి వీరత్యాగాలను స్మరించుకొని, కేకు కట్ చేసి ఆనందోత్సాలతో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను జరుపుకొన్నారు. 

నాల్గొవ సారి కూడా బహరేన్ లో మన తెలంగాణా రాష్ట్ర ఆవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా వుందని అన్నారు. ముఖ్యంగా మన తెలంగాణ గల్ఫ్ ప్రవాసులకూ ఎలాంటి సమస్యలు వచ్చిన ఆదుకోవడానికి 50 కోట్ల నిధులతో ఎన్నారై సెల్ ను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60ఏళ్ల పాటు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనకబాటుకు గురైందని, అనేక ఆశలు, ఆశయాలతో, అమరుల త్యాగాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణను అదే కృషి, పట్టుదల, సంకల్పంతో  ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు తీసుకుని వెళ్తున్నారని అన్నారు, గత నాలుగేళ్ళుగా అందిస్తున్న పింఛన్లు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా, మంచినీటి కోసం  మిషన్ భగీరథ, సాగునీటి కోసం మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా, 24గంటల విద్యుత్, ప్రాజెక్టులనిర్మాణం వంటి చర్యల ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు.

 ఒకప్పుడు మొగులు వంకచూసిన రైతు బిడ్డలు నేడు సీఎం కేసీఆర్ సారధ్యంలో రైతును రాజుగా చేయాలని రైతు రుణమాఫీ చేసి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల చేపట్టారని, గల్ఫ్ వలసలు కూడా కొంత తగ్గే ఆవకాశముందని, నేడు రైతన్నలు అందరు కేసీఆర్ వంక చూస్తున్నారని అన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్నిరంగాలను అభివృద్ధి చేస్తూ జనరంజక పాలనా కొనసాగిస్తూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నది ఒకే ఒక్క సీఎం కేసీఆర్ అన్ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు బోలిశెట్టి వెంకటేష్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రాజేంధార్, రవిపటేల్, గంగాధర్, జాయింట్ సెక్రెటరీలు విజయ్, దేవన్న, రాజేందర్ రావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రమోద్, సాయన్న, సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios