Sri Lanka emergency: గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంటు ఆమోదించడంతో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దేశంలో ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించారు. 

Sri Lanka economic crisis: ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతో ప్రజా తిరుగుబాటు నుండి తప్పించుకోవడానికి గొట‌బ‌య రాజ‌ప‌క్సే ఈ వారం విదేశాలకు పారిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంటు ఆమోదించడంతో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రాణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దేశంలో ఎమ‌ర్జెన్సీని ప్ర‌క‌టించారు. ఎమ‌ర్జెన్సీకి సంబంధించిన అధికార ఉత్త‌ర్వులను జారీ చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దేశం విడిచి పారిపోయిన గోటబయ రాజపక్సే రాజీనామాను పార్లమెంటు ఆమోదించిన తర్వాత శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయ‌న శ్రీలంకలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించారు. బుధవారం మాల్దీవులకు పారిపోయి, గురువారం సింగపూర్‌లో అడుగుపెట్టిన రాజపక్సే అధికారికంగా రాజీనామా చేశారని స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా శుక్రవారం తెల్లవారుజామున ధృవీకరించారు. సంక్షోభంలో ఉన్న దేశంలో 72 గంటల గందరగోళాన్ని తెర‌ప‌డింది. ఈ స‌మ‌యంలో నిరసనకారులు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి నివాసాలతో సహా అనేక ఐకానిక్ భవనాలపై దాడి చేశారు. రాజపక్సే, తన రాజీనామాను స్పీకర్ అబేవర్దనకు ఇమెయిల్ పంపారు. అతను తన రాజీనామాను ఆమోదించినట్లు చెప్పాడు. ఆయన రాజీనామాతో దాదాపు 20 ఏళ్లపాటు దేశంలో అధికారంలో ఉన్న కుటుంబం పాలనకు తెరపడింది.

ఈ నేప‌థ్యంలోనే శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆదివారం ఆలస్యంగా విడుదల చేసిన ప్రభుత్వ నోటీసు ప్రకారం.. అతని పరిపాలన సామాజిక అశాంతిని అరికట్టడానికి, ద్వీప దేశాన్ని పట్టుకున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంద‌ని పేర్కొన్నారు. "ప్రజా భద్రత, పబ్లిక్ ఆర్డర్ రక్షణ, సమాజ జీవితానికి అవసరమైన సామాగ్రి, సేవల నిర్వహణ ప్రయోజనాల దృష్ట్యా ఇది ఉపయోగకరంగా ఉంటుంద‌ని" నోటిఫికేషన్ పేర్కొంది. శ్రీలంక‌ను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించడానికి శ్రీలంక పార్లమెంటు శనివారం సమావేశమైంది. సంక్షోభంలో ఉన్న దేశానికి కొంత ఉపశమనం కలిగించడానికి ఇంధన రవాణాను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. 

Scroll to load tweet…

కాగా, విక్రమసింఘే, రాజపక్సే మిత్రుడు. పూర్తి సమయం అధ్యక్ష పదవిని చేపట్టే అగ్రశ్రేణి పోటీదారులలో ఆయ‌న ఒక‌రుగా ఉన్నారు. అయితే నిరసనకారులు కూడా ఆయనను తొలగించాలని కోరుతున్నారు. ఇది అతను ఎన్నుకోబడితే మరింత అశాంతికి దారి తీస్తుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, శ్రీలంక స్వాతంత్య్రం పొందిన‌ప్ప‌టి నుంచి ఎప్పూడు చూడ‌ని ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావ‌స‌రాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఉన్నవాటి ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. పెట్రోల్‌, డీజిల్ అందుబాటులో లేక ర‌వాణ వ్య‌వ‌స్థ దెబ్బ‌తిన్న‌ది. అంద‌ర్జాతీయ స‌మాజం నుంచి స‌హాయం కోసం ఎదురుచూస్తోంది శ్రీలంక‌.