Asianet News TeluguAsianet News Telugu

అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ మోత..  వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మ‌రోసారి తుపాకీ మోత మోగింది. హ్యూస్టన్‌లో మరోసారి కాల్పుల ఘటన తెరపైకి  వచ్చింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే.. డెట్రాయిట్ నగరంలో కూడా తుపాకీ మోత మోగింది.  

Six Killed In US In Separate Shootings In Detroit, Houston
Author
First Published Aug 29, 2022, 8:54 AM IST

అగ్రరాజ్యం అమెరికాలో మ‌రోసారి తుపాకీ మోత మోగింది. హ్యూస్టన్‌లో మరోసారి కాల్పుల ఘటన తెరపైకి  వచ్చింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి ఓ భవనానికి నిప్పంటించి, ఆపై పారిపోతున్న వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో కనీసం నలుగురు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హత్యకు గురైన నలుగురిలో ఒకరు అనుమానితుడు అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. అనుమానితుడిని హ్యూస్టన్ పోలీసు అధికారి కాల్చి చంపారు. మృతి చెందిన వారు 40-60 ఏళ్ల మధ్య వయస్కులుగా గుర్తించారు. అనుమానితుడు మొదట మంటలు ఆర్పి, నివాసితులు బయటకు వచ్చే వరకు వేచి ఉండి, ఆపై వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నైరుతి హ్యూస్టన్‌లోని మిశ్రమ పారిశ్రామిక-నివాస ప్రాంతంలో శనివారం అర్థరాత్రి 1 గంటలకు ఈ సంఘటన జరిగిందని పోలీసు చీఫ్ ట్రాయ్ ఫైనర్ తెలిపారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై పోలీసు చీఫ్ ట్రాయ్ ఫైనర్ మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సాయుధుడు కాల్పులు జరిపాడని, పోలీసు అధికారులు తమను తాము రక్షించుకున్న సమయంలో సాయుధుడిపై కాల్పులు జ‌రపగా.. ఆ కాల్పుల్లో మరణించాడని చెప్పారు. నిందితుడి వివ‌రాల‌ను మాత్రం అధికారులు ఇంకా విడుదల చేయలేదు. ఈ సంఘటనలో అగ్నిమాపక సిబ్బంది లేదా అధికారులు గాయపడలేదని ఆయన చెప్పారు.

మ‌రో ఘ‌ట‌న అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ఆదివారం ఉదయం జ‌రిగింది. యునైటెడ్ స్టేట్స్‌లోని  రెండు గంటల వ్యవధిలో డెట్రాయిట్‌లో ఒక వ్యక్తి  నలుగురు వ్యక్తులు కాల్పులు జ‌రిపాడు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్ద‌రు చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తుంది.  నిందితుడి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ ఘ‌ట‌న‌పై మిడ్ వెస్ట్రన్ సిటీ పోలీస్ చీఫ్ జేమ్స్ వైట్ మీడియాతో మాట్లాడుతూ.. కాల్పుల్లో ఇద్దరు మహిళలతో స‌హా న‌లుగురు గాయ‌ప‌డ్డారు. బాధితుల్లో  ఇద్ద‌రు మరణించగా, ఒకరు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. అనుమానితుడి ఫోటోల‌ను విడుదల చేసిన‌ట్టు తెలిపారు. అతన్ని గుర్తించిన ఎవరైనా  911కి కాల్ చేయాలని కోరారు.
 

ఒహియోలో నలుగురు మృతి 

అమెరికాలోని ఓహియోలో ఈ నెల 7వ తేదీన ఓ వ్యక్తి ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓహియోలోని బట్లర్ టౌన్‌షిప్‌లో కాల్పుల ఘటన తర్వాత దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. 

అమెరికాలో రోజుకో కాల్పుల ఘటన

అమెరికాలో తుపాకీ నియంత్రణ చట్టం వచ్చిన తర్వాత కూడా  ప్రతిరోజూ కాల్పుల ఘటన చోటు చేసుకుంటుంది. ఈ చ‌ట్టాన్ని క‌ఠినంగా అమ‌లు చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమైపోయాయి. అయితే బిడెన్ ప్రభుత్వం దీన్ని ఎందుకు నియంత్రించలేక పోతుందనేది ప్రశ్న త‌లెత్తుంది.  కాల్పులు జరిగిన ప్రతి సంఘటన తర్వాత, దాడి చేసిన వ్యక్తిని పట్టుకుంటారు. అతనిపై చర్యలు తీసుకుంటారు, అయినప్పటికీ ఈ ఘ‌టన‌లు ఆగ‌డం లేదు.
 
300కు పైగా కాల్పుల ఘటనలు 

ఈ ఏడాది అమెరికాలో 300కు పైగా కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. తుపాకీ నియంత్రణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత కూడా కాల్పుల ఘటనలు తగ్గుముఖం పట్టకపోగా, ఎక్కువగా కావ‌డం గ‌మ‌న్హారం. 

Follow Us:
Download App:
  • android
  • ios