Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. రెండు దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న ఈ యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యాపై ఆంక్ష‌లు విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ఆ దేశంపై అంత‌ర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. రెండు దేశాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం 19 రోజుల‌కు చేరుకుంది. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా ముందుకుసాగుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు మార్లు ఆ దేశ నేత‌లు అణుబాంబు దాడులు గురించి ప్ర‌స్తావించ‌డం ఉక్రెయిన్ తో పాటు యావ‌త్ ప్ర‌పంచాన్ని ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉక్రెయిన్ పై అనేక దేశాలు ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ర‌ష్యా సైతం వెన‌క్కి త‌గ్గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటూ... త‌న‌పై ఆంక్ష‌లు విధించిన దేశాల‌పై ర‌ష్యాలో కార్య‌కలాపాలు నిర్వ‌హ‌ణ‌పై ఆంక్ష‌లు విధిస్తోంది.

ఎలాగైనా రష్యాకు అడ్డుకట్ట వేయాల‌ని భావిస్తున్న ప‌లు దేశాలు ఆ దేశంపై మ‌రింత క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ప్ర‌పంచంలో ర‌ష్యాను ఒంట‌రిని చేయాల‌ని భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే అమెరికాతో పాటు నాటో కూటమి దేశాలు, ప‌శ్చిమ దేశాలు ర‌ష్యాపై ఇప్ప‌టికే ప‌లు ఆంక్ష‌లు విధించాయి. తాజాగా ఆస్ట్రేలియా.. ర‌ష్యా తీరును ఖండిస్తూ.. ఆంక్ష‌లు విధిస్తోంది. ఆస్ట్రేలియాలో కార్య‌కలాపాలు నిర్వ‌హిస్తున్న ర‌ష్యా వ్యాపార వేత్త‌లు, ఆ దేశంలో వాణిజ్యం నిర్వ‌హిస్తున్న వారిపై క‌ఠిన‌మైన ఆంక్ష‌లు విధిస్తోంది ఆస్ట్రేలియా. ప్ర‌పంచ దేశాల ఆంక్ష‌ల ప్ర‌భావం ప‌డ‌కుండా ర‌ష్యా సైతం చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధ ప్ర‌భావం ఇప్పుడు ప్ర‌పంచ దేశాల‌పై ప‌డుతోంది. ఆ క్రమంలోనే ఆ దేశంపై ఆంక్ష‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్ర‌పంచంలో అత్య‌ధిక ఆంక్ష‌లు ఎదుర్కొంటున్న దేశంగా ర‌ష్యా మారింది. ర‌ష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ఆప‌కుండా ఇలాగే ముందుకు సాగితే మ‌రిన్ని కఠిన ఆంక్ష‌లు విధించాల‌ని ప‌లు ప్ర‌పంచ దేశాలు యోచిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా, రష్యా ప్రపంచంలోనే అత్యధికంగా ఆంక్ష‌లు ఎదుర్కొంటున్న దేశంగా మారింద‌ని న్యూయార్క్‌కు చెందిన ఆంక్షల వాచ్‌లిస్ట్ సైట్ పేర్కొంది. ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు ఉక్రేనియన్ తిరుగుబాటు ప్రాంతాలైన డొనెట్స్క్ మరియు లుహాన్స్క్‌లను స్వతంత్ర రాష్ట్రాలుగా ప్రకటించిన ఒక రోజు తర్వాత ఫిబ్రవరి 22న రష్యాపై US మరియు దాని మిత్రదేశాలు మొదట ఆంక్షలు విధించాయని Castellum.AI తెలిపింది.

ఇవేవి ప‌ట్టించుకోని ర‌ష్యా.. ఉక్రెయిన్ పై మిలిట‌రీ చ‌ర్య‌కు దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది. దీంతో అమెరికా మిత్ర దేశాల‌తో పాటు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు ర‌ష్యాపై ఆంక్ష‌ల‌ను పెంచాయి. ప్ర‌పంచంలోని వంద‌లాది దేశాలు వీటిని అనుస‌రిస్తూ.. రష్యాపై ఆంక్షలు విధించాయి. ఫిబ్రవరి 22కి ముందు రష్యాపై 2,754 ఆంక్షలు అమల్లో ఉన్నాయని, ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించిన త‌ర్వాత రోజుల్లో 2,778 అదనపు ఆంక్షలు విధించాయని తెలిపింది. దీంతో ర‌ష్యాపై విధించిన మొత్తం ఆంక్ష‌లు 5,532 కు చేరుకున్నాయ‌ని Castellum.AI పేర్కొంది. ఇదిలావుండగా, ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ పై పడింది. చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆహార ధాన్యాల ధరలు సైతం తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.