Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు నెమ్మ‌దిగా ముందుకు సాగుతున్న ర‌ష్యా బ‌ల‌గాలు.. పుతిన్ ఆదేశాల‌తో మ‌రింత దూకుడుగా కదులుతూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. చాలా దేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాధిత ఉక్రెయిన్ పౌరుల‌కు బ్రిటన్ క్వీన్ ఎలిజ‌బెత్ అండ‌గా నిలిచారు.  

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి కొన‌సాగుతూనే ఉంది. ఇరు దేశాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు జ‌రిగిన అవి స‌ఫ‌లం కాలేదు. ర‌ష్యా మ‌రింత దూకుడుగా ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో అంత‌ర్జాతీయ స‌మాజం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే శాంతియుతంగా ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించుకోవాలని చాలా దేశాలు కోరుతున్నాయి. అయినప్ప‌టికీ ర‌ష్యా ఏమాత్రం ప‌ట్టించుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతూ.. ఉక్రెయిన్ పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. దీంతో ఆగ్ర‌హించిన చాలా దేశాలు ఆ దేశంపై ఆంక్ష‌ల విధింపును పెంచుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికా, బ్రిట‌న్‌, ప‌లు యూర‌ప్ దేశాలు ఆంక్ష‌లు విధించాయి. మ‌రిన్ని ఆంక్ష‌ల దిశ‌గా ముందుకు సాగుతున్నాయి. ఈ యుద్ధం కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు, సైనికులు ప్రాణాలు కోల్పోయార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ర‌ష్యా దాడి కార‌ణంగా ఉక్రెయిన్ రూపురేఖ‌లు పూర్తిగా మారిపోయాయి. ఎక్క‌డ చూసినా శిథిలాలు క‌న‌బ‌డే విధంగా మారిపోతోంది. 

ఈ క్ర‌మంలోనే అంత‌ర్జాతీయ స‌మాజం ఉక్రెయిన్ పౌరుల‌కు మ‌ద్ద‌తు తెలుపుతోంది. వారికి అండ‌గా నిలుస్తూ.. సాయం చేస్తోంది. ఇప్ప‌టికే అనేక దేశాలు, అంత‌ర్జాతీయ సంస్థ‌లు భారీ ఆర్థిక సాయం ప్ర‌క‌టించాయి. బ్రిట‌న్ రాణి క్వీన్ ఎలిజ‌బెత్ ఉక్రెయిన్ పౌరుల‌కు అండ‌గా నిలిచారు. భారీ సాయం చేయ‌డానికి హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో తీవ్రమవుతున్న సంక్షోభం మధ్య, బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ II బాధితులకు మద్దతుగా నిలిచారు. రష్యా సైనిక చర్య వల్ల ప్రభావితమైన పౌరులకు సహాయం చేయమని విపత్తుల అత్యవసర కమిటీ (DEC) ఉక్రెయిన్ విజ్ఞప్తికి విరాళం ఇచ్చారు. "డిజాస్టర్స్ ఎమర్జెన్సీ కమిటీకి మద్దతునిస్తూ మరియు DEC ఉక్రెయిన్ హ్యుమానిటేరియన్ అప్పీల్‌కు ఉదారంగా విరాళం అందించినందుకు హర్ మెజెస్టి ది క్వీన్‌కి చాలా ధన్యవాదాలు" అని సంస్థ తెలిపింది.

Scroll to load tweet…

ఎలిజబెత్, ప్రిన్స్ చార్లెస్ మరియు కెమిల్లాకు ముందు, డచెస్ ఆఫ్ కార్న్‌వాల్ లండన్‌లో ఉక్రేనియన్లతో భావోద్వేగ సమావేశాన్ని నిర్వహించారు. ఉక్రెయిన్ లోని డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల‌ను ర‌ష్యా స్వతంత్రంగా గుర్తించిన మూడు రోజుల త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 24న ర‌ష్యా ఉక్రెయిన్ పై మిలిట‌రీ చ‌ర్య‌ను ప్రారంభించింది. తాము పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డం లేద‌ని మొద‌ట్లో పేర్కొన్న ర‌ష్యా.. ఆ త‌ర్వాత దూకుడు పెంచుతూ.. ఉక్రెయిన్ లోని న‌గ‌రాల‌పై బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. ర‌ష్యా మొద‌లు పెట్టిన ఈ దాడి కార‌ణంగా రెండు దేశాల‌కు భారీ న‌ష్టం జ‌రిగింద‌నీ, వేల మంది చ‌నిపోయార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ర‌ష్యా తీరుపై ఇప్పుడు చాలా దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. వెంట‌నే ఈ ఉక్రెయిన్ పై దాడుల‌ను ఆపాల‌నీ, లేకుంటే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నాయి. అయితే, ఇవేవి ప‌ట్టించుకోని ర‌ష్యా.. త‌న దూకుడును పెంచింది. ఉక్రెయిన్ సైనిక బ‌ల‌గాలను లేకుండా చేసేంత వ‌ర‌కు ఈ దాడి కొన‌సాగుతుందని ఆ దేశ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మ‌రోవైపు న్యూక్లియ‌ర్ వెప‌న్స్ అధికారుల‌ను సిద్ధంగా ఉండాలంటూ ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ సూచించ‌డంపై అన్ని దేశాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.