Asianet News TeluguAsianet News Telugu

ఈ ఏడాది అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్: పైజర్ సీఈఓ

ఈ ఏడాది అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి వస్తోందని నమ్ముతున్నామని అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ ప్రకటించింది. తాజా నివేదికల ప్రకారంగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నామన్నారు.

Pfizer CEO claims COVID-19 vaccine could be ready by October end, says report
Author
Washington D.C., First Published May 29, 2020, 6:03 PM IST


న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ నాటికి కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి వస్తోందని నమ్ముతున్నామని అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ సంస్థ ఫైజర్ ప్రకటించింది. తాజా నివేదికల ప్రకారంగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నామన్నారు.

ఫైజర్ సీఈఓ అల్బర్ట్ బౌర్లా ఈ మేరకు ఈ విషయాన్ని ప్రకటించారని  టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ అనే పత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు జర్మన్ సంస్థ బయోన్‌టెక్ తో కలిసి పనిచేస్తున్నట్టుగా ప్రకటించింది.

ఈ ఏడాది చివరి నాటికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యాక్సిన్స్ రావడం ప్రారంభం కానుందని ఆస్ట్రాజెనెకా అధిపతి అధినేత పాస్కల్ సోరియట్ పేర్కొన్నట్లుగా రిపోర్టు చేసింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ భాగస్వామ్యంతో అస్ట్రాజెనెకా తో  వ్యాక్సిన్ తయారికి కృషి చేస్తున్నామని ప్రకటించింది.

ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ సిద్దమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా  సుమారు 100కి పైగా సంస్థలు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు పరిశోధనలను చేస్తున్నాయి. 

also read:ల్యాబ్ టెక్నీషీయన్‌పై దాడి: కరోనా అనుమానితుల శాంపిల్స్‌ ఎత్తుకెళ్లిన కోతులు

ఇప్పటికే కొన్ని సంస్థలు తమ పరిశోధనల్లో ప్రగతి ఉందని ఆ సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆక్స్ ఫర్డ్ సంస్థ కోతులపై చేసిన పరిశోధనలు సక్సెస్ అయినట్టుగా ప్రకటించాయి. మనుషులపై తమ వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రకటించింది. 

ఈ యూనివర్శిటీతో కలిసి పుణెకు చెందిన సీరమ్ సంస్థ కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు మరికొన్ని సంస్థలు కూడ తమ ప్రయోగాలు ఫలవంతంగా ముందుకు సాగుతున్నట్టుగా ప్రకటించాయి. కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టేవరకు కూడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.


 

Follow Us:
Download App:
  • android
  • ios