సాక్షాత్తూ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితికి పడిపోయింది. కొన్ని నెలలుగా చెల్లించాల్సిన బకాయిలు రూ.41 లక్షలకు చేరుకుంది. బిల్లు చెల్లించని పక్షంలో పీఎంవో ఆఫీసుకు కరెంట్ నిలిపివేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించినట్లు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది.
విద్యుత్ బిల్లులు కట్టకపోవడంతో ఏకంగా ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్ చేస్తామంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇది ఎక్కడో తెలుసా మన దాయది దేశం పాకిస్తాన్లో. అసలే పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో ప్రస్తుతం ప్రభుత్వం నడపడం కూడా కష్టంగా మారిపోయింది.
గ్రే లిస్ట్లో పెట్టడంతో నిధులు సైతం రావడం లేదు ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో సాక్షాత్తూ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కార్యాలయం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని స్థితికి పడిపోయింది.
కొన్ని నెలలుగా చెల్లించాల్సిన బకాయిలు రూ.41 లక్షలకు చేరుకుంది. బిల్లు కట్టాలంటూ ఇప్పటికే ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లయ్ కంపెనీ పలుమార్లు నోటీసులు సైతం జారీ చేసినప్పటికీ.. పీఎంవో నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు బుధవారం మరోసారి నోటీసులు జారీ చేశారు. బిల్లు చెల్లించని పక్షంలో పీఎంవో ఆఫీసుకు కరెంట్ నిలిపివేస్తామని అధికారులు గట్టిగా హెచ్చరించినట్లు పాక్ మీడియా కథనాలు ప్రచురించింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 29, 2019, 3:38 PM IST