Asianet News TeluguAsianet News Telugu

జేసీబీపై వివాహవేదిక వద్దకు నూతన వధూ వరులు.. పాకిస్తాన్ జంట వీడియో వైరల్

ఆ జంట తమ పెళ్లిని తమతోపాటు అక్కడి ప్రజలూ ఎల్లకాలం గుర్తుంచుకునేలా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. అందుకే పెళ్లి వేదిక వద్దకు జేసీబీపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ జంట ఈ ఆలోచన చేసింది. ఇలా చేయడానికి ఓ కారణముంది.
 

pakistan couple went to venue on jcb video went viral
Author
New Delhi, First Published Oct 6, 2021, 5:13 PM IST

న్యూఢిల్లీ: సాధారణంగా నూతన వధు వరులు తమ పెళ్లిని జీవితాంతం ఒక మధురజ్ఞాపకంగా మార్చుకోవాలని చూస్తారు. అందుకోసం ఎంత ఖర్చయినా భరించడానికి couples సిద్ధపడతారు అందరి దృష్టిని ఆకర్షించడానికి వినూత్న మార్గాలనూ అన్వేషిస్తుంటారు. తాజాగా, pakistanలోని ఓ జంట తమ పెళ్లి వేడక వద్దకు jcbపై వెళ్లారు. జేసీబీ ముందు నిలుచుని కెమెరాలకు ఫోజులిచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో వారి పెళ్లి హాట్ టాపిక్ అయింది. ఇరుగు పొరుగు వచ్చి అదో భారీ బహిరంగ ప్రదర్శనగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో viral అవుతున్నది. 

 

పాకిస్తాన్‌లోని హుంజా లోయలో ఈ వేడుక జరిగినట్టు తెలిసింది. ఈ వీడియోను పామిర్ టైమ్స్ ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న దంపతులు ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ఓ ప్రత్యేకమైన ట్విస్ట్ ఉన్నది. ఆ ఎక్స్‌కెవేటర్ వరుడికి చెందినది. ఆ వరుడు చేసే వృత్తిని నూతన వధువు గౌరవించాలని భావించింది. అందుకే భర్త వృత్తిని గౌరవించాలని నూతన వధువు, తన భార్య కోరికను నేరవేర్చి కొత్త మార్గాన్ని అనుసరించాలనే ఉబలాటంలో వరుడు.. ఇలా ఇరువురూ జేసీబీపై తరలివచ్చారు.

దీంతో ఆ నూతన దంపతులు తమ పెళ్లిని తమ జ్ఞాపకాల్లోనే కాదు.. అక్కడి ప్రజల జ్ఞాపకాల్లోనూ తమ పెళ్లిని సుస్థిరం చేయడంలో సఫలమయ్యారు. 

ఈ వీడియో పోస్టు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నది. ఎవరికి వారు తమ తమ అభిప్రాయాలను జోడిస్తూ ట్వీట్లు చేశారు. కొందరు శెభాష్ అంటుండగా, ఇంకొందరు ఇది ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios