Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.యుద్ధం ఆపాలని ఐరాసతో పాటు చాలా దేశాలు కోరుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా సైనిక ఆపరేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఎంపీ సోఫియా ఫెడినా మాట్లాడుతూ.. మా బంకర్లు సిద్ధంగా ఉన్నాయనీ, ప్రజలను సురక్షితంగా ఉంచడం కోసం అక్కడికి తరలిస్తున్నామని తెలిపారు.
Russia Ukraine Crisis: రష్యా ఉక్రెయిన్పై యుద్ధాని ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించగా, 'మా బంకర్లు సిద్ధంగా ఉన్నాయి' అని ఉక్రెయిన్ ఎంపీ సోఫియా ఫెడినా అన్నారు. రష్యా.. సైనిక విమానాశ్రయాలు, నిల్వలపై దాడులు ప్రారంభించిందనీ.. ఉక్రెయిన్ రాజధాని కైవ్లో వైమానిక దాడి సైరన్లు వినిపించాయని ఆమె అన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు సురక్షిత గృహాలు ఉన్నాయని పేర్కొన్న ఆమె.. ప్రజలను అక్కడికి తరలిస్తున్నామని తెలిపారు. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్పై మిలిటరీ ఆపరేషన్ ను ప్రకటించారు. అయితే, ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని తాము ప్లాన్ చేయడం లేదని పేర్కొనడం గమనార్హం. రష్యా ప్రకటించిన సైనిక చర్య ఉక్రెయిన్ను "సైనికీకరణ" చేయడానికి ప్రయత్నిస్తుందని మరియు ఉక్రెయిన్ నుండి వచ్చిన బెదిరింపులకు ప్రతిస్పందనగా ఉంటుందని తెలిపారు.
రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన కొద్దిసేపటికే, ఉక్రెయిన్ (Ukraine) రాజధాని కైవ్, ప్రధాన నగరమైన ఖార్కివ్ ప్రాంతాలలో పెద్ద పేలుళ్లు సంభవించాయి. ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఐరాసతో పాటు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు అమెరికా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఇదిలావుండగా, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది. యుద్ధ పరిణామాలు ఉక్రెయిన్కు వినాశకరమనీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా దూరం అవుతాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. మానవత దృపథంతో యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు చివరి నిమిషంలో విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఐక్యరాజ్యసమితిలోని ఉక్రెయిన్ రాయబారి సెర్గీ కిస్లిత్స్య (Sergiy Kyslytsya) భద్రతా మండలి అత్యవసర సమావేశంలో "యుద్ధాన్ని ఆపండి" అని యూఎన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.“యుద్ధాన్ని ఆపడం ఈ సంస్థ బాధ్యత. కాబట్టి యుద్ధాన్ని ఆపడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయాలని నేను మీలో ప్రతి ఒక్కరినీ కోరుతున్నారు” అని భద్రతా మండలి సమావేశంలో ఉక్రేనియన్ రాయబారి సెర్గీ కిస్లిత్స్య (Sergiy Kyslytsya) కోరారు. అత్యవసర సమావేశంలోSergiy Kyslytsya మాట్లాడుతూ.. ఇది తీవ్రతరం కావడానికి సమయం ఉంది. కాబట్టి సంఘర్షణను ఆపడానికి ఇతర దేశాలలు సాయం చేయాలని ఆయన కోరారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా దీనిని ధృవీకరించారు. ఉక్రేనియన్ నగరాలు ఎమర్జెన్సీ విధించబడింది అని తెలిపారు.
“పుతిన్ ఇప్పుడే ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించాడు. శాంతియుతమైన ఉక్రేనియన్ నగరాలు ఎమర్జెన్సీలోకి వెళ్లాయి. ఇది దురాక్రమణ యుద్ధం. ఉక్రెయిన్ తనను తాను రక్షించుకుంటుంది.. ఈ పోరులో గెలుస్తుంది. ప్రపంచం పుతిన్ను ఆపగలదు.. ఆ పనిచేయాలి. ఇప్పుడు యాక్షన్ తీసుకునే సమయం వచ్చింది' అని కులేబా ట్వీట్ చేశారు. తూర్పు ఉక్రెయిన్లోని డాన్బాస్ను రక్షించడానికి పుతిన్ ప్రత్యేక "మిలిటరీ ఆపరేషన్" ప్రకటించిన వెంటనే ఈ ట్వీట్ వచ్చింది. డాన్బాస్ ప్రాంతంలో సైనిక చర్య తీసుకోవాలనే రష్యా నిర్ణయాన్ని సమర్థిస్తూ, యుఎన్లోని రష్యా రాయబారి వాసిలీ అలెక్సీవిచ్ నెబెంజియా "ఉక్రెయిన్ చుట్టూ ఉన్న నేటి సంక్షోభానికి మూలం ఉక్రెయిన్ చర్యలే" అని అన్నారు. "ఉక్రెయిన్ చుట్టూ నేటి సంక్షోభానికి మూలం ఉక్రెయిన్ చర్యలు, అనేక సంవత్సరాలుగా (మిన్స్క్ ఒప్పందం) కింద దాని బాధ్యతలను విధ్వంసం చేస్తున్నాయి" అని నెబెంజియా అన్నారు.
