అమెరికాలో కాల్పుల కలకలం: ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
అమెరికాలోని వాషింగ్టన్ కు సమీపంలోని రెంటన్ లో జరిగిన కాల్పుల్లో లోఒకరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వాషింగ్టన్: USA లోని రెంటన్ లో జరిగిన కాల్పుల ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాషింగ్టన లోని సీటెల్ సమీపంలోని Renton లో కాల్పుల ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటలన స్థలానికి చేరుకొన్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒకరు మరణించారని కూడా పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడినట్టుగా ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.పెద్ద ఎత్తున జనం గుమికూడిన సమయంలో చోటు చేసుకొన్న వివాదం కారణంగా Firing కు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఒకరి కంటే ఎక్కువ మంది కాల్పులకు దిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై విచారణ నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు.