లాటరీలో రూ.290 కోట్లు.. తెలియక హ్యండ్ బ్యాగ్ లోనే.. ఆరువారాల తరువాత..
జర్మనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 45 ఏళ్ల ఓ మహిళ కొనుగోలు చేసిన లాటరీతో రూ. 290 కోట్లు గెలుచుకుంది. ఈ డ్రాలో ఆమె ఒక్కతే విజేతగా నిలిచింది. ఇది తెలియని ఆమె ఆరు వారాల పాటు ఆ లాటరీ టికెట్ను తన బ్యాగ్ లోనే ఉంచుకుంది
జర్మనీకి చెందిన ఓ మహిళకు కలలో కూడా ఊహించని జాక్ పాట్ తగిలింది. లాటరీలో 39 మిలియన్ డాలర్లు.. అంటే సుమారు 290 కోట్ల రూపాయలు గెలుచుకుంది. ఈ విషయం తెలియని ఆమె వారం పాటు ఆ టిక్కెట్ ను తన బ్యాగ్ లోనే ఉంచుకుంది. చివరికి లాటరీ మొత్తాన్ని తీసుకొని సంతోషంలో మునిగిపోయింది.
జర్మనీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 45 ఏళ్ల ఓ మహిళ కొనుగోలు చేసిన లాటరీతో రూ. 290 కోట్లు గెలుచుకుంది. ఈ డ్రాలో ఆమె ఒక్కతే విజేతగా నిలిచింది. ఇది తెలియని ఆమె ఆరు వారాల పాటు ఆ లాటరీ టికెట్ను తన బ్యాగ్ లోనే ఉంచుకుంది... అని లాటరీ టికెట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
అయితే ఆ మహిళ పేరును వెల్లడించలేదు. మొత్తం మీద ఆలస్యంగా అయినా ఆ మహిళ డబ్బు తీసుకుంది. విషయం తెలియక ఆ టికెట్లు తన బ్యాగులో ఉంచుకుని ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆ మహిళ తెలిపారు. గెలుచుకున్న మొత్తం తన కుటుంబం ఆరోగ్య కర జీవితాన్ని గడిపేందుకు సరిపోతుందని చెప్పారు.