Asianet News TeluguAsianet News Telugu

ఏడాది క్రితం నాటి నూడిల్స్ తిని.. 9మంది మృతి

సంవత్సరం క్రితం వండిన నూడిల్స్ ని ఆవురావురు మంటూ లాంగించేశారు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు.

Nine members Of Same Family Die After eating noodles from freezer
Author
Hyderabad, First Published Oct 22, 2020, 3:41 PM IST

నిన్న వండిన వంటే.. ఈ రోజు కి బాగుండదు. ఫ్రిడ్జ్ లో పెడితే.. మహా అయితే ఇంకో రెండు రోజులు ఉంటుంది. అలాంటిది.. ఏకంగా సంవత్సరం క్రితం వండిన ఆహారం ఇప్పటిదాకా ఎలా బాగుంటుంది. కుళ్లిపోయి.. పాడైపోయి ఉంటుంది. దానిని గమనించిన ఓ కుటుంబం.. సంవత్సరం క్రితం వండిన నూడిల్స్ ని ఆవురావురు మంటూ లాంగించేశారు. చివరకు అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Nine members Of Same Family Die After eating noodles from freezer

చైనాలోకి బీజింగ్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏడాది క్రితం ఇంట్లో నూడుల్స్ వండుకున్నారు. కారణం ఏంటో తెలియదు కానీ, దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏడాది పాటు అలాగే వదిలేశారు. ఏడాది తర్వాత కుటుంబ సభ్యులంతా తలో చేయి వేద్దాం అన్నట్లుగా తిన్నారు. పులియబెట్టిన మొక్కజొన్న పిండితో చేసిన ఈ నూడుల్స్‌ను యేడాది పాటు ఫ్రిజ్‌లో పెట్టడంతో దాంట్లో బోంగ్రెకిక్ ఆసిడ్ అనే విష పదార్థం తయారైంది. దీంతో ఈ నూడుల్స్ తిన్న 9 మంది (అందరూ పెద్దవారే) చనిపోయారు. కాగా, ముగ్గురు చిన్నారులు నూడుల్స్ రుచి వారికి నచ్చకపోవడంతో వారు తినలేదు. నూడుల్స్ తినకపోవడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios