మయన్మార్ లో నేటి ఉదయం భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7గా నమోదు అయ్యింది. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రకంపనలతో కెంగ్ తుంగ్ సిటీ వణికిపోయింది.

Myanmar Earthquake : ఈశాన్య మయన్మార్ లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ తుంగ్ పట్టణానికి నైరుతి దిశగా 76 కిలోమీటర్ల దూరంలో 5.7 తీవ్రతతో భూకంపం కేంద్రీకృతమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Gang rape : వ్యాపారి భార్యపై సామూహిక అత్యాచారం.. సిగరెట్లతో కాల్చి చిత్రహింసలు.. బంగారం, నగదు, స్కూటీ చోరీ..

ఒక్క సారిగా వచ్చిన ఈ ప్రకంపనలతో కెంగ్ తుంగ్ సిటీ వణికిపోయింది. భూకంపం వచ్చిన ఈ ప్రాంతం చైనా, లావోస్, థాయ్ లాండ్ సరిహద్దులకు సమీపంలో ఉంది. ఈ ప్రకంపనల తీవ్రత థాయ్ లాండ్ లోని రెండో అతిపెద్ద నగరం, ప్రముఖ పర్యాటక కేంద్రం చియాంగ్ మాయిలోనూ కనిపించాయి.

దారుణం.. మహిళా డాక్టర్ కు మద్యం తాగించి లైంగిక దాడి.. వీడియో తీసి బ్లాక్ మెయిల్..

కాగా.. మయన్మార్ లో భూకంపాలు, భూకంపాలు సర్వసాధారణం. అయితే తాజా భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా.. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.