పసికందు ఏడుపు ఆపడం లేదని పాల బాటిల్ లో మద్యంనింపి పట్టించిందో తల్లి. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అమెరికా : కాలిఫోర్నియాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. శాన్ బెర్నార్డినో కౌంటీకి చెందిన ఒక మహిళ తన పసికందు ఏడుపును ఆపడానికి బిడ్డకు పట్టే పాల బాటిల్ లో మద్యం నింపింది. ఈ ఆరోపణలతో పిల్లలను ప్రమాదంలో పడేశిందంటూ ఆమె మీద పోలీసులు అభియోగాలు మోపారు. 

దీనికి సంబంధించి లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, హోనెస్టి డి లా టోర్రే, 37, శనివారం రియాల్టోలోని ఓ ఆస్పత్రికి తన బిడ్డను తీసుకువెళ్లింది. ఆ సమయంలో చిన్నారి "మత్తులో" ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటను తల్లిని అరెస్టు చేశారు.

రోడ్డుపై స్కూటర్ మీదినుంచి పడిన వ్యక్తి.. కారు ఆపి, యోగక్షేమాలు కనుక్కున్న రాహుల్ గాంధీ.. వీడియో వైరల్..

శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ మాట్లాడుతూ, మహిళ రియాల్టో నుండి డ్రైవింగ్ చేస్తూ వెడుతోంది. ఆ సమయంలో పాప ఏడుపును ఆపడానికి ప్రయత్నించింది. దీనికోసం పాపకు పట్టే బాల బాటిల్ లో మద్యం ఇచ్చిందని చెప్పారు.

37 ఏళ్ల మహిళకు ఈ నేరం కింద 60,000 డాలర్ల బాండ్‌పై వెస్ట్ వ్యాలీ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. ఆమె మంగళవారం కోర్టుకు హాజరు కావచ్చని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. చిన్నారి పరిస్థితి ఏమిటనేది తెలియరాలేదు. ఈ ఘటన తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది.

మరో దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఓహియోలో ఓ తల్లి తన 16 నెలల పసిబిడ్డను హతమార్చింది. పదిరోజులు ఆమె సెలవులకు వెడుతూ.. చిన్నారిని అలాగే వదిలేసింది. ప్యూర్టో రికో, డెట్రాయిట్ పర్యటనకు వెడుతూ.. శిశువు ఇంటి లోపల ఒంటరిగా వదిలేసి వెళ్లింది. దీంతో చూసుకునేవారు లేక చిన్నారి మృతి చెందింది. క్రిస్టెల్ కాండెలారియో (31) యేళ్ల ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.