కరోనాను కంట్రోల్ చేయలేక మంగోలియా ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాదిమంది ఈ వైరస్ బారినపడ్డారు. అంతేకాదు వందలాది మంది చనిపోతున్నారు.
ఉలాన్బాతార్: కరోనాను కంట్రోల్ చేయలేక మంగోలియా ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. కరోనా వైరస్ దేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాదిమంది ఈ వైరస్ బారినపడ్డారు. అంతేకాదు వందలాది మంది చనిపోతున్నారు.
కరోనా వైరస్ ను నియంత్రించలేక ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ దేశంలో కరోనా రెండో దశ ప్రారంభమైంది. ప్రతి రోజూ వందలాది కేసులు నమోదౌతున్నాయి. కరోనా సోకిన రోగితో పాటు ఆమె బిడ్డకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది.ఈ పరిణామం తీవ్ర నిరసనలకు కారణమైంది.
ఈ ఘటనను నిరసిస్తూ వందలాది మంది యువకులు ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనలతో ప్రధాని పదవికి ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందని తీవ్రంగా విమర్శలను సర్కార్ ఎదుర్కొంది.
కరోనా కట్టడిలో తొలుత మంగోలియా కఠినంగానే వ్యవహరించింది. ఆ తర్వాత కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం వైపల్యం చెందింది. దీంతో వైరస్ వ్యాప్తి పెరిగింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 22, 2021, 10:25 AM IST