అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం: తల్లి సహా ఆరుగురు సజీవ దహనం
అమెరికాలోని మిస్సిసిపిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
వాషింగ్టన్: అమెరికాలోని మిస్సిసిపీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ఘటనలో తల్లి సహా ఆరుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు.ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకొంది.
అమెరికాలోని మిస్సిసిపీలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో 33 ఏళ్ల తల్లితో పాటు ఆరుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు. ఇంట్లో మంటలు ఎలా వ్యాప్తిం చెందాయనే విషయమై ఇంకా నిర్ధారణ కాలేదు.
ఈ ప్రమాదంలో కుటుంబ యజమాని ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే తన కుటుంబసభ్యులను కాపాడేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించినట్టుగా అధికారులు చెప్పారు. తమ కుటుంబసభ్యులన కాపాడేందుకు ప్రయత్నించిన అతను కూడ తీవ్రంగా గాయపడినట్టుగా అధికారులు ప్రకటించారు.
ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టుగా అధికారులు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఇంకా వివరాలు అందాల్సి ఉంది.