భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి 24 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యటించారు. నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అమెరికన్లు ఆసక్తిగా సిద్ధమవుతున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 21 నుంచి 24 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పర్యటించారు. నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు అమెరికన్లు ఆసక్తిగా సిద్ధమవుతున్నారు. యూఎస్ పర్యటన సందర్భంగా జూన్ 22న ప్రతినిధుల సభ, సెనేట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ ఇటీవల ప్రధాని మోదీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో రెండోసారి ప్రసంగించనున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం.
ప్రధాని మోదీ చేసే ప్రసంగం కోసం తాము ఎదురుచూస్తున్నామని పలువురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. భారత ప్రధాని అమెరికా పర్యటన ప్రాముఖ్యత గురించి కూడా వారు మాట్లాడారు. ‘‘భారతదేశం ఎంత ముఖ్యమైనదో చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. అందుకే ప్రధానమంత్రి మోదీ ఇక్కడికి రావడం, ఆయన పర్యటనలో చేయనున్న సంభాషణలు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను. భారతదేశం ప్రాముఖ్యత గురించి ఆలోచించని ఎవరైనా.. సంఖ్యల బలం, పారిశ్రామిక స్థావరం మొత్తం, స్నేహపూర్వక వేదిక నుంచి చైనా ఏకకాలంలో ఉత్పత్తి చేసే వస్తువులను ఉత్పత్తి చేసే మొత్తాన్ని గుర్తించలేదు. డబ్ల్యూటీవో నిబంధనలను ఉల్లంఘించకుండా వాటిని అనుసరిస్తున్న దేశం. మాకు అలాంటి భాగస్వామి కావాలి’’ యూఎస్ ప్రతినిధుల సభ సభ్యులు రిచర్డ్ మెక్కార్మిక్ అన్నారు.
‘‘వచ్చే వారం మన దేశ రాజధానికి ప్రధాని మోదీని స్వాగతించడానికి నేను సంతోషిస్తున్నాను. అమెరికా-భారత్ బంధం ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనది’’ అని యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి బడ్డీ కార్టర్ అన్నారు.
‘‘అమెరికా కాంగ్రెస్లో ఆయన (పీఎం మోదీ) చేసే ప్రసంగం కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ ఉభయ సభలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైన స్థానం. మేము శ్రద్దగా ఉంటాము. మేము కలిసి చేసే అన్ని పరిష్కారాల కోసం ఎదురుచూస్తాము’’ అని మోదీ చేపట్టబోయే అమెరికా పర్యటన గురించి అమెరికా కాంగ్రెస్లో మహిళా సభ్యురాలు షీలా జాక్సన్ లీ అన్నారు.
