హఫీజ్ సయీద్ ఇంటి సమీపంలో పేలుడు: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు
పాకిస్తాన్లోని లాహోర్లో బుధవారం నాడు జరిగిన పేలుడులో ఇద్దరు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. లష్కరే తోయిబా నేత హఫీజ్ సయీద్ ఇంటి వద్ద ఇవాళ ఈ పేలుడు చోటు చేసుకొంది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని లాహోర్లో బుధవారం నాడు జరిగిన పేలుడులో ఇద్దరు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. లష్కరే తోయిబా నేత హఫీజ్ సయీద్ ఇంటి వద్ద ఇవాళ ఈ పేలుడు చోటు చేసుకొంది. పాకిస్తాన్ లోని లాహోర్ కు సమీపంలోని జోహర్ లో బాంబు పేలుడు చోటు చేసుకొన్న ప్రాంతానికి పోలీస్ బృందాలు చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి.
ఈ ఘటనలో గాయపడినవారిని జిన్నా ఆసుపత్రికి ఆటోలు, కార్లలో తరలించినట్టుగా పోలీసులు తెలిపారు. పేలుడుతో సమీపంలోని ఇళ్లు, భవనాల గాజు కిటికీలు పగిలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొన్ని భవనాలు కూడ దెబ్బతిన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి ఈ ప్రాంతంలో మోటార్ బైక్ ను పార్క్ చేసి ఉంచాడని ప్రత్యక్ష సాక్షి స్థానిక మీడియాకు తెలిపారు. ఈ బైక్ పార్క్ చేసిన కొద్దిసేపటికే పేలుడు సంబవించింది. పేలుడు సంబంవించిన ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లించారు. ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడిగా హఫీజ్ ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.