కజికిస్తాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మిలటరీ ప్రాంతంలో జరిగిన ఈ విస్ఫోటనంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది

ఆఫ్ఘనిస్తాన్‌కు అత్యంత సమీపంలో వుండే కజికిస్తాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. మిలటరీ ప్రాంతంలో జరిగిన ఈ విస్ఫోటనంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 80 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. తారాజ్ సిటీలో ఈ పేలుడు చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన సహాయక బృందాలు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. పేలుళ్ల తీవ్రత నేపథ్యంలో సమీపంలోని గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. పేలుళ్ల తీవ్రత కారణంగా అటుగా వెళ్లే రోడ్లు, రైల్వే మార్గాలను మూసివేశారు అధికారులు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred