పాకిస్తాన్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు అతి కిరాతకంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా శరీరాన్ని ముక్కలుగా నరికి ఒక్కోచోట పడేశాడు. 

పాకిస్తాన్ : మనుషుల మధ్య మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వావివరసలు విచ్ఛిన్నమవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే కొందరు దాడులు, నేరాలకు ఒడిగడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా, ఒళ్లు గగర్పొడిచేలా వ్యవహరిస్తున్నారు. కుటుంబ, సామాజిక పరిస్థితులు వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్నిసార్లు హత్యలు, మానభంగాలకు వెనకాడటం లేదు. మరికొన్ని ఘటనల్లో సొంత వాళ్ళు, రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు కన్నవాళ్ళపైనే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా పాకిస్థాన్లో ఇలాంటి దారుణం జరిగింది. తండ్రి కొడుతున్నాడు అన్న కారణంతో ఓ యువకుడు తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేసాడు అంతేకాకుండా కొన్ని శరీర భాగాలకు నిప్పంటించాడు.

ఈ ఘటనలో పోలీసులకు మరి కొన్నివిస్తుపోయే విషయాలు తెలిశాయి. పాకిస్తాన్లోని కరాచీ సమీపంలో సూపర్ హైవేపై అఫ్గాన్ బస్తీ వద్ద పోలీసులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహానికి తల, కాళ్లు లేకుండా ఉండడం… శరీర భాగాలను ముక్కలుగా నరికి బ్యాగ్ లో పడేసి ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఒక్కొక్కటీ తెలుస్తుంటే షాక్ తో ఒళ్లు జలదరించిపోయి.. వణికిపోయారు. 

సదరు మృతుడిని కన్నకొడుకే తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేశాడని తెలుసుకున్నారు. ఆ తర్వాత మృతదేహం గుర్తు పట్టకుండా ముక్కలుగా నరికినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ముక్కలుగా నరికిన బాడీ పార్ట్స్ కు నిప్పు అంటించినట్లు వెల్లడించాడు. తల, మొండెం లేని శరీరాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్ బృందం చాలా కష్టపడి అతని ఆచూకీ గుర్తించింది. ఈ శరీర భాగాలు పీఐబీ కాలనీకి చెందిన సలీం ఖిల్జీ గా గుర్తించారు. అతడి కొడుకు పై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు.

తండ్రి హత్య చేసిన తర్వాత..తలను లియారీ నదిలో, కాళ్లను జూబ్లీ మార్కెట్లో, ఇతర శరీర భాగాలను అఫ్గాన్ బస్తీ సమీపంలో వదిలి వెళ్ళినట్లు ఎస్ఎస్పీ అల్తాఫ్ హుసేన్ వివరించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఇది అత్యంత భయంకరమైన సంఘటన అని, కన్న తండ్రి కొడుతున్నాడు అనే కారణంతో అతడిని చంపడం అత్యంత దారుణమని ఎస్ఎస్పీ ఆవేదన చెందారు. తన తండ్రి మృతదేహాన్ని ఎవరు గుర్తించవద్దనే ఉద్దేశంతో ఏప్రిల్ 21న సుత్తితో కొట్టి హత్య చేసి.. ముక్కలు ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పడేశాడని అతని చెప్పుకొచ్చాడు.