జాక్ పాట్ కొట్టాడు.. వరించిన రూ.13 వేల కోట్ల లాటరీ.. ఎవరికంటే ?
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి మెగా మిలియన్స్ లాటరీ తగిలింది. దీంతో అతడికి భారీ మొత్తంలో డబ్బులు రానున్నాయి. రూ.13 వేల కోట్ల ప్రైజ్ మనీ అతడు గెలుచుకున్నాడు.
ఓ అమెరికా వాసికి అదృష్టం వరించింది. ఏకంగా అతడు జాక్ పాట్ కొట్టాడు. రూ.13 వేల కోట్ల విలువ చేసే లాటరీ అతడిని వెతుక్కుంటూ వచ్చింది. అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద మూడో ప్రైజ్ మనీ అందించే ఈ లాటరీని మంగళవారం డ్రా తీశారు. అయితే ఇందులో ఫ్లొరిడాకు చెందిన వ్యక్తికి 1.58 బిలియన్ డాలర్ల లాటరీ తగిలింది.
తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలో పొగలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
మెగా మిలియన్స్ గా పిలిచే ఈ లాటరీలో 13, 19, 20, 32, 33, 14 నెంబర్లు ఉన్న టికెట్లకు అదృష్టం వరించింది. వీరందరికీ భారీ మొత్తంలో ప్రైజ్ మనీ రానుంది. అయితే 1.58 బిలియన్ డాలర్లు గెలుచుకున్న వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. అతడిని గుర్తింపును ఇంకా ఆ సంస్థ వెల్లడించలేదు.
అయితే ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీని గెలుచుకున్నప్పటికీ.. అతడికి ఒకే సారి ఈ డబ్బులు అందవు. వీటిని అతడికి 30 ఏళ్ల పాటు ప్రతీ ఏడాది కొంత మొత్తంగా అందజేస్తారు. ఒక సారి కావాలంటే కూడా అందిస్తారు. కానీ దానికి ఒక కండీషన్ వర్తిస్తుంది. ఒకే సారి డబ్బులు కావలంటే అందులో సగం మాత్రమే ఇస్తారు. దాదాపుగా 783.3 మిలియన్ డాలర్లే అందజేస్తారు. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.6,488 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. మరి ఆ విజేత ఏ ఆప్షన్ ఎంచుకుంటాడో తెలియాల్సి ఉంది.