Islamic State: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ISIS) నూతన నాయకుడుగా అబూ అల్-హసన్ అల్-హషేమీ అల్-ఖురైషీ (Abu al-Hassan al-Hashemi al-Quraishi) అలియాస్ జుమా అవద్ అల్-బద్రీ నియమితుడైనట్టు U.S. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తెలిపింది. ఇతడు దివంగత ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ సోదరుడని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తెలిపింది. గత నెలలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ISIS) చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ హతమైనట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.
Islamic State: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ISIS) నూతన నాయకుడుగా అబూ అల్-హసన్ అల్-హషేమీ అల్-ఖురైషీ (Abu al-Hassan al-Hashemi al-Quraishi) అలియాస్ జుమా అవద్ అల్-బద్రీ నియమితుడైనట్టు U.S. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తెలిపింది. ఇతడు దివంగత ఇస్లామిక్ స్టేట్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ( Abu Bakr al-Baghdadi) సోదరుడని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ తెలిపింది. అమెరికా ప్రత్యేక దళాలు గత నెలలో వాయువ్య సిరియాలో జరిపిన మెరుపు దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ISIS) చీఫ్ అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ హతమైనట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇరాక్ ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ప్రకారం.. గత రెండు సంవత్సరాల క్రితం.. 2019లో బాగ్దాదీ కలిసి ఉగ్రదాడులు పాల్పడినట్టు తెలిపారు. బాగ్దాదీకి అత్యంత విశ్వసనీయుడనీ, ఉత్తర సిరియా నుండి ఇస్తాంబుల్, టర్కీకి వెళ్లి గ్రూప్ కార్యకలాపాలకు నాయకత్వం వహించే వాడని సమాచారం. ఇస్లామిక్ స్టేట్ నూతన నాయకుడి అసలు పేరు జుమా అవద్ అల్-బద్రీ, అతను ఇరాకీ, బాగ్దాదీ సోదరుడు అని ఇద్దరు ఇరాక్ భద్రతా అధికారులు ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్ నూతన నాయకుడిని ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని ఆడియో టేపుల ద్వారా వెల్లడించింది.
బద్రీ గురించి చాలా తక్కువగా తెలుసనీ, కానీ అతను 2003 U.S. దండయాత్ర తర్వాత ఉద్భవించిన ఇరాకీ జిహాదీల సన్నిహిత సర్కిల్ నుండి వచ్చాడని ఇరాక్ భద్రతా అధికారులు ప్రకటించారు. "బద్రీ 2003లో సలాఫీ జిహాదీ గ్రూపుల్లో చేరాడనీ, ఈ గ్రూపులో వ్యక్తిగత సహచరుడిగా, ఇస్లామిక్ నేతలకు న్యాయ సలహాదారుగా బాగ్దాదీతో పాటు ఉండేవాడని ఇరాక్ భద్రతా అధికారి తెలిపారు.
బద్రీ చాలా కాలంగా ఇస్లామిక్ స్టేట్ చెందిన షురా కౌన్సిల్కు అధిపతిగా వ్యవహరించారని, ఖలీఫాను చంపినప్పుడు లేదా పట్టుకున్నప్పుడు వారసత్వాన్ని నిర్ణయించే నాయకత్వ సమూహానికి అధిపతిగా ఉందని అధికారి తెలిపారు. 2020లో ఆన్లైన్లో ప్రచురించబడిన దివంగత ఇరాకీ ఇస్లామిక్ స్టేట్ నేత హిషామ్ అల్-హషేమీ చేసిన దాడుల్లో, ఐదుగురు సభ్యుల షురా కౌన్సిల్కు బద్రీ నాయకుడని పేర్కొంది.
ఇస్తామిక్ స్టేట్స్ సంస్థ నూతన నాయకుడిని ప్రకటించే క్రమంలో.. ఖురైషీ తన మరణానికి ముందు బద్రీ ని తన తన వారసుడిగా ప్రకటించాడనీ, ఆడియో రికార్డింగ్ ద్వారా ఈ ఉగ్రసంస్థ ప్రకటించింది. బద్రీ నూతన నాయకత్వంలో ఇరాక్, సిరియాల్లో ఉగ్ర దాడులు పెరిగే అవకాశముందనీ, ఆ దాడులు ఎలా నిర్వహించబడతాయనేది.. ముందుగా తెలుసుకోవడం కష్టమని ఇరాక్ భద్రతా అధికారులు, విశ్లేషకులు తెలిపారు.
భద్రతాకు కొత్త ముప్పు
ఈ ప్రకటన అనంతరం.. ఇరాక్ భద్రతా అధికారి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్తో మాట్లాడుతూ బద్రీ ఇటీవల సిరియా సరిహద్దు దాటి ఇరాక్లోకి వెళ్లాడని చెప్పారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల పర్యవేక్షణ బృందం డిసెంబర్లో వ్రాసిన నివేదిక ప్రకారం.. బద్రీ ఇస్తామిక్ స్టేట్స్ ఆర్థిక వనరులపై నియంత్రణ వారసత్వం పొందుతాడు. ఇటీవలి అంచనాలు ... ఇస్తామిక్ స్టేట్స్ ఆదాయం $25 మిలియన్ నుంచి $50 మిలియన్ల వరకు ఉంటుంది.
బద్రీకి మరో ఇద్దరు సోదరులు ఉన్నారు, ఒకరిని ఇరాకీ భద్రతా బలాగాలు అదుపులో ఉన్నాడని ఇరాక్ భద్రతా అధికారి తెలిపారు. మరో సోదరుడి ఆచూకీ తెలియరాలేదని, అయితే అతడు మరో ఇస్లామిస్ట్ రాడికల్ గా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.