ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి
ఇండోనేషియాను భారీ భూకంపం తాకింది. లాంబాక్ ద్వీపంలో 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దాని వల్ల 82 మంది మరణించారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.
జకార్తా: ఇండోనేషియాను భారీ భూకంపం తాకింది. లాంబాక్ ద్వీపంలో 7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దాని వల్ల 82 మంది మరణించారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు.
భూకంపం15 కి.మీ లోతులో కేంద్రీకృతమైనట్లు అమెరికా జియలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం తర్వాత రెండు సార్లు కాస్తా తక్కవ స్థాయిలో భూకంపాలు వచ్చాయి. దాదాపు 25 ప్రకంపనలు వచ్చాయి. అధికారులు తొలుత సునామీ హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.
ఈ భూకంపం తీవ్రతకు దాదాపు 900 కి.మీ దూరంలోని బాండుంగ్ నగరంలోనూ నష్టం వాటిల్లింది. బాలి ద్వీపంలో భూకంపం తీవ్రత ఎక్కువగా కనిపించింది. వారం రోజుల క్రితమే లాంబాక్లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చి 17 మంది మరణించారు. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి.