చీర మార్చినంత ఈజీగా.. 19మంది భర్తలను మార్చింది..!
పెళ్లి జరిగి రెండు నెలలు అయిన తర్వాత.. తన పుట్టింటికి వెళ్లివస్తానని యువతి కోరింది. పెళ్లి తర్వాత భార్య కోరిన మొదటి కోరిక కదా.. అని సరే వెళ్లిరా అని చెప్పాడు. అలా వెళ్లిన సదరు యువతి మళ్లీ తిరిగి రాలేదు.
చీరలు మార్చుకున్నంత సులభంగా..ఓ మహిళ భర్తలను మార్చేసింది. అలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 19మందిని మార్చింది. అది కూడా కేవలం డబ్బుకోసమే ఆమె అలా చేయడం గమనార్హం. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చైనాలోని మంగోలియాలోని బయన్నూర్ కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరోని ఆశ్రయించింది. అక్కడ అతనికి ఓ అమ్మాయి బాగా నచ్చింది. అయితే.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇతే 148,000 (భారత కరెన్సీలో రూ.16.లక్షలు) ఎదురు కట్నం అడిగింది. అమ్మాయి నచ్చడంతో వెంటనే ఆ డబ్బు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి జరిగి రెండు నెలలు అయిన తర్వాత.. తన పుట్టింటికి వెళ్లివస్తానని యువతి కోరింది. పెళ్లి తర్వాత భార్య కోరిన మొదటి కోరిక కదా.. అని సరే వెళ్లిరా అని చెప్పాడు. అలా వెళ్లిన సదరు యువతి మళ్లీ తిరిగి రాలేదు. దీంతో.. ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. ఓ రోజు సోషల్ మీడియాలో.. తన భార్యకు మరొకరితో పెళ్లి జరుగుతున్న వీడియో చూసి షాకయ్యాడు. దీంతో.. మోసపోయానని గ్రహించిన సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఇక పోలీసుల దర్యాప్తు ఆమె గురించి విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇలా ఇప్పటి వరకు ఆ యువతి 19 మందిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కేవలం డబ్బు కోసమే ఆమె ఈ పెళ్లి నాటకాలు ఆడటం గమనార్హం.
పెళ్లికి ముందే ఎదురు కట్నం తీసుకోవడం. పెళ్లి తరువాత పత్తాలేకుండా పోవడం.. పారిపోయి మరొకరిని పెళ్లి చేసుకోవడం. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెళ్లి కాని 19మంది యువకుల్ని పెళ్లి చేసుకుందని, వారి వద్ద నుంచి రూ. 2.28కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులైన మ్యారేజ్ బ్యూరో ప్రతినిధి లీ' తో పాటూ మరో ఇద్దరు సభ్యుల్ని అదుపులోకి తీసుకున్నారు.