అమెరికాలోని ఓ మహిళా జైలులో రెండు వర్గాలమధ్య జరిగిన గ్యాంగ్ వార్ లో 41మంది మహిళా ఖైదీలు మృతి చెందారు.
అమెరికా : అమెరికాలోని ఓ జైలులో దారుణ ఘటన వెలుగు చూసింది. హోండురస్ జైలులో మహిళా ఖైదీల మధ్య జరిగిన గొడవల్లో 41 మంది మృత్యువాత పడ్డారు. రాజధాని తెగుసిగల్పాకు వాయువ్యంగా 30 మైళ్ల దూరంలో తమరా మహిళా జైలు. ఉండి ఈ జైలులో మంగళవారం నాడు రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి.
ఖైదీలు మొత్తం రెండు వర్గాలుగా మారి కొట్టుకున్నారు. ఈ గొడవల్లో 41 మంది మహిళా ఖైదీలు మరణించారు. మరణించిన వారిలో కొందరు బుల్లెట్ గాయాలతో మృతిచెందగా.. మరికొందరు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు మహిళా ఖైదీలు గాయాల పాలయ్యారు. వీరిని తెగుసిగల్పా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
WATCH: ఇంటర్నేషనల్ యోగా డే .. నరేంద్ర మోడీ మదిలో పుట్టిన ఆలోచన , 9 ఏళ్లలో సాధించినదేంటీ..?
మహిళా జైల్లో అక్రమ కార్యకర్తలను అరికట్టడానికి అధికారులు ఇటీవల ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగినట్టుగా హోండురస్ జైళ్ల శాఖ అధికారి జూలిస్సా బంద్ విల్లాన్యువా తెలిపారు.
హోండురాస్లోని మహిళా జైలులో జరిగిన గొడవల్లో ముఠా సభ్యులు మరో 46 మంది మహిళా ఖైదీలను తుపాకీతో కాల్చి, కొడవళ్లతో కొట్టి, ఆపై ప్రాణాలతో బయటపడిన వారిని వారి సెల్లలోకి లాక్కెళ్లి, మండే ద్రవం పోసి చంపినట్లు అధికారి బుధవారం తెలిపారు.
మంగళవారం నాటి అల్లర్లలో జరిగిన మారణహోమం ఇటీవలి కాలంలో మహిళా జైలులో జరిగిన అత్యంత దారుణమైన దారుణం, దీనిని అధ్యక్షురాలు జియోమారా కాస్ట్రో "రాక్షసం" అని అన్నారు.
బారియో 18 గ్యాంగ్ గా పిలవబడే ముఠా సభ్యులు జైలులో ఉన్న ఖైదీలపై కొద్ది వారాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఖైదీల బంధువులు తెలిపారు.
ముఠా సభ్యులు నిషేధిత ఆయుధాలను తమ దగ్గర ఉంచుకన్నారు. కాపలాదారులను మభ్యపెట్టి.. తమ విరోధి గ్యాంగ్ మీద దాడి చేశారు. బాధితులను లోపల బంధించడానికి తాళాలు కూడా తీసుకువెళ్లారు. వారిని కాల్చి చంపారు. కొన్ని సెల్ లలో మంటలు పెట్టారు. ఐ మంటల తీవ్రత వల్ల సెల్ గోడలు నల్లబడ్డాయి. మంచాలు లోహపు కుప్పలుగా మారాయి.
