ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకి రావొద్దని తాలిబన్లు హెచ్చరించారు. వారంతా ఇళ్లల్లోనే వుండాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే మహిళా ఉద్యోగులు బయటకు రావాలని తాలిబన్లు హెచ్చరించారు. ఇప్పటికే హెరాత్ ప్రావిన్స్లో కో ఎడ్యుకేషన్ను తాలిబన్లు నిషేధించిన సంగతి తెలిసిందే.
అందరికీ క్షమాభిక్ష పెట్టామని ఎవరి పనులు వారు స్వేచ్ఛగా చేసుకోవచ్చని.. అలాగే మహిళలు సైతం ఉద్యోగాలు చేసుకోవచ్చని తాలిబన్లు తొలి రెండు రోజులు శాంతి మంత్రాలు జపించారు. అయితే రోజులు గడిచే కొద్ది తమలోని పాత మతాచారాలను బయటకు తీస్తున్నారు తాలిబన్లు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తాజాగా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకి రావొద్దని తాలిబన్లు హెచ్చరించారు. వారంతా ఇళ్లల్లోనే వుండాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే మహిళా ఉద్యోగులు బయటకు రావాలని తాలిబన్లు హెచ్చరించారు. ఇప్పటికే హెరాత్ ప్రావిన్స్లో కో ఎడ్యుకేషన్ను తాలిబన్లు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్ యూనివర్సిటీలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే మహిళా విద్యార్థుల సంఖ్యపై ఇబ్బంది పడుతున్న ప్రైవేటు వర్సిటీలకు ఇబ్బందిగా భావిస్తున్నారు.
