జపాన్‌లో భూకంపం.. భారీ విధ్వంసం

జపాన్‌లో భూకంపం చోటు చేసుకుంది.. ఒకాసా నగరంలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు జపాన్ భూభౌతిక శాఖ తెలిపింది.. భూకంపం దాటికి నగరంలోని చాలా చోట్ల భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మరణించగా.. 90 మంది వరకు గాయపడినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. సహాయ పునరావాస చర్యల కోసం రెస్క్యూటీమ్‌లను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా బుల్లెట్ రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred