నగ్నంగా ఫొటోలు, వీడియోలు.. పట్టపగలు మహిళల సాహసం.. సోషల్ మీడియాలో వైరల్.. ఆ తరువాత..
దుబాయ్ లో కొంతమంది మహిళలు.. ఒంటిమీద నూలు పోగైనా లేకుండా నగ్నంగా మారి బాల్కనీలో.. పట్టపగలు అందరూ చూస్తుండగా ఫొటోలకు ఫోజులిచ్చారు.
దుబాయ్ లో ఓ విచిత్రం జరిగింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఆ సంఘటనకు పాల్పడ్డవారందరికీ ఒక్కొక్కరికీ రూ. 99,716 జరిమానాతో పాటు, ఆరు నెళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.. ఇంతకీ వాళ్లు చేసిన నేరం ఏంటీ అంటారా?
దుబాయ్ లో కొంతమంది మహిళలు.. ఒంటిమీద నూలు పోగైనా లేకుండా నగ్నంగా మారి బాల్కనీలో.. పట్టపగలు అందరూ చూస్తుండగా ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తరువాత ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
శనివారం నుంచి సోషల్ మీడియా వీటితో హోరెత్తిపోతోంది. ఇంకేముంది.. అసలే దుబాయ్.. ఇలాంటివన్నీ చాలా స్ట్రిక్ట్.. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటన వెనకున్న వారందరినీ అరెస్ట్ చేశారు. అయితే పబ్లిసిటీ కోసమే ఇలా చేశామని నిందితులు ఒప్పుకున్నారు.
అయితే అక్కడి చట్టాలకు వ్యతిరేకంగా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడినందుకు నిందితులకు ఆరు నెళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ 5 వేల దిర్హామ్ లు అంటే రూ. 99,716 జరిమానా పడే అవకాశముంది.