దుబాయిలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి
చిన్న విమానం కుప్పకూలి నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది. అమెరికా టెక్ దిగ్గజం హనీవెల్ కి చెందిన డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ కి చెందిన విమానం కుప్పకూలింది.
చిన్న విమానం కుప్పకూలి నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన దుబాయిలో చోటుచేసుకుంది. అమెరికా టెక్ దిగ్గజం హనీవెల్ కి చెందిన డైమండ్ ఎయిర్ క్రాఫ్ట్ కి చెందిన విమానం కుప్పకూలింది.
విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అది కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలెట్, కో పైలెట్ కూడా ఉన్నారు. దుబాయి ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంతో.. దుబాయ్ విమానాశ్రయంలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. పలు విమానాలు ఆలస్యమైనాయి.
ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందనీ, ముందు జాగ్రత్త చర్యగా కొన్ని విమానాలను దారి మళ్లించామని ప్రభుత్వం ప్రకటించింది. కాగా దుబాయ్లోని అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాల్లో ఒకటిగా పేరుగాంచింది.
దుబాయ్లో ఫ్లైట్ కాలిబ్రేషన్ సర్వీసెస్ నిమిత్తం డీఏ42 విమానాన్ని అద్దెకు తీసుకున్నామని హనీ వెల్ తెలిపింది. ప్రమాదంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసిన సంస్థ బాధిత కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించింది.