Asianet News TeluguAsianet News Telugu

భారత్ అభ్యంతరం చెప్పినా.. శ్రీలంక పోర్టుకు చైనా నిఘా షిప్

చైనా స్పై షిప్ యువాన్ వాంగ్ 5 శ్రీలంక రావడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. చైనా పడవకు అనుమతి ఇవ్వరాదని శ్రీలంకకు సూచించింది. కానీ, ఈ శ్రీలంక ఈ షిప్‌నకు అనుమతి ఇచ్చినట్టు తాజాగా వెల్లడించింది.
 

despite india flags objection sri lank allows chineese spy ship
Author
New Delhi, First Published Aug 13, 2022, 7:45 PM IST

న్యూఢిల్లీ: భారత్ అభ్యంతరం చెప్పినా.. చైనా నిఘా పడవకు శ్రీలంక అనుమతించింది. త్వరలోనే చైనా స్పై షిప్ శ్రీలంక పోర్టుకు చేరనుంది. చైనా నిఘా పడవ యువాన్ వాంగ్ 5 ఒక రీసెర్చ్, సర్వే షిప్ అని ఇంటర్నేషనల్ షిప్పింగ్, అనలిటిక్ సైట్లు వర్ణిస్తుంటాయి. 

హిందూ మహాసముద్రంపై, శ్రీలంకపై చైనా తన ఇన్‌ఫ్లుయెన్స్ పెంచుకున్నట్టు మన దేశం భావిస్తున్నది. ఈ రెండింటిపై చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకున్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువాన్ వాంగ్ 5 పడవను స్పేస్, శాటిలైట్‌ల ట్రాకింగ్ కోసం పంపుతున్నారా? అనే సందేహాలు వస్తున్నాయి. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంలో చైనా ఈ పడవను వినియోగించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే శ్రీలంకలో చైనా నిర్మించిన పోర్టు హంబంటోటాకు రావడాన్ని భారత్ అభ్యంతర పెట్టింది. ఆ షిప్‌ను అనుతించవద్దని శ్రీలంకకు తెలిపింది.

నిజానికి ఈ షిప్ ఆగస్టు 11వ తేదీనే రావల్సింది. కానీ, భారత్ సూచనల మేరకు శ్రీలంక అనుమతులు ఇవ్వలేదు. కానీ, తాజాగా, మళ్లీ ఆ షిప్‌కు అనుమతి ఇచ్చింది. శ్రీలంక హార్బర్ మాస్టర్ నిర్మల్ పీ సిల్వా ఈ విషయాన్ని తెలిపారు. చైనాకు చెందిన స్పై షిప్ యువాన్ వాంగ్ 5 ఈ నెల 16  నుంచి 22 మధ్య రావడానికి అనుమతి ఇస్తున్నట్టు వివరించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ నుంచి అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ రోజు తమకు డిప్లమాటిక్ క్లియరెన్స్ వచ్చిందని చెప్పారు. ఈ షిప్‌ను హ్యాండిల్ చేయడానికి స్థానిక ఏజెంట్లతో మాట్లాడుతామని తెలిపారు. 

ప్రస్తుతం చైనా పడవు పోర్టు నుంచి ఆగ్నేయం వైపుగా సుమారు 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పోర్టు అధికారులు తెలిపారు. హంబంటోటా డీప్ సీ పోర్టుకు రాబోతునున్నదని చెప్పారు.

ఈ షిప్ భారత కార్యకలాపాలు, భారత మిలిటరీ కేంద్రాలు సహా పలు అంశాలపై నిఘా వేసే అవకాశం ఉన్నదని మన దేశం ఆందోళన వ్యక్తం చేసింది. కానీ, శ్రీలంక ఇప్పుడు చైనా షిప్‌కు అనుమతి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ షిప్ శ్రీలంక వస్తుండటాన్ని తాము దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత రక్షణ, ఆర్థిక ప్రయోజనాల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వివరించారు.

హంబంటోటా పోర్టును చైనా నిర్మించింది. ఈ నిర్మాణానికి శ్రీలంక చైనా కంపెనీకి 1.4 బిలియన్ డాలర్లు ఇచ్చింది. అనంతరం ఈ పోర్టును చైనా 99 ఏళ్ల లీజుకు తీసుకుంది. ఇందుకు నిర్మాణానికి తీసుకున్న దాని కంటే కూడా తక్కువ మొత్తం (సుమారు 1.12 బిలియన్ డాలర్లు) ఇవ్వడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios