Covid-19: ఆందోళనను పెంచుతున్న కరోనా వేరియంట్లు.. : ప్రపంచ ఆరోగ్య సంస్థ
Coronavirus: పలు దేశాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్త వేరియంట్లు ఆందోళనను పెంచుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) పేర్కొంది.
Global Covid cases: చైనాలో మొదటగా వెలుగుచూసిన కరోనా వైరస్ తక్కువ కాలంలోనే యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టుంది. దాదాపు అన్ని దేశాల్లో తన పంజా విసురుతూ.. లక్షలాది మంది ప్రాణాలు తీసుకుంది. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేస్తూ.. ఆస్పత్రి పాలు చేసింది. అయితే, కరోనా కట్టడి కోసం టీకాలు, వివిధ రకాల మందులు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. వైరస్ తన రూపు మార్చుకుంటూ.. కొత్త వేరియంట్లుగా విజృంభిస్తూ.. మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్లు ఆందోళనను పెంచుతున్నాయని పేర్కొంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం బీఏ.5 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా ఒక నెలలో నివేదించబడిన కరోనావైరస్ సీక్వెన్స్లలో దాదాపు 99 శాతం జూలై 8-ఆగస్టు 8 మధ్య Omicron వేరియంట్ కు చెందినవి ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా వారపు బులెటిన్లో BA.5 మ్యూటెషన్లు గురించి హైలెట్ చేసింది. ఈ వైవిధ్యంలోని కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ఇతర రూపాంతరాల ప్రాబల్యం BA.4, BA.2, BA.2.12.1 గణనీయంగా తగ్గిందని చెప్పింది. అదనపు ఉత్పరివర్తనలు BA.5 సంతతి మ్యూటెషన్లకు లింక్ చేయబడ్డాయి. ఇవి స్పైక్, నాన్-స్పైక్ ప్రాంతాలలో కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ .. మ్యూటెషన్ల ప్రాబల్యం పెరుగుదల, వాటి ముఖ్యమైన లక్షణాలలో మార్పును ట్రాక్ చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వైరస్ బూస్టర్ డోసుల పంపిణీ విస్తృతంగా కొనసాగుతున్న పరిస్ధితుల మధ్య ఆగస్టు 1-ఆగస్టు 7 వారంలో ప్రపంచవ్యాప్తంగా 6.9 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ వారంలో అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన దేశాల్లో జపాన్ టాప్ ఉంది. అక్కడ 1,496,968 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని WHO పేర్కొంది. అలాగే, యునైటెడ్ స్టేట్స్ అత్యధిక మరణాలను (2,764 ) నివేదించిందని తెలపింది.
అమెరికా (759 806) తర్వాత అధిక సంఖ్యలో కేసులను నమోదు చేసిన ఇతర దేశాలు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, వియత్నాం, టర్కీలు ఉన్నాయి. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైన దేశాల జాబితాలో బ్రెజిల్, ఇటలీ, జపాన్, స్పెయిన్ లు ఉన్నాయి. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 593,491,397 కేసులు నమోదయ్యాయి. 6,449,206 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికంగా కేసులు, మరణాలు నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, యూకే, సౌత్ కోరియా, రష్యా, టర్కీ, జపాన్ లు ఉన్నాయి. భారత్ లోనూ కరోనా వైరస్ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,561 మంది కోవిడ్-19 బారినపడ్డారు. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,42,23,557 కు పెరిగింది. మరణాల సంఖ్య 5,26,928కి పెరిగింది.