Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్: ఇటలీలో దారుణం.. చైనా ను బీట్ చేసింది..

కరోనావైరస్ దెబ్బతో ఇటలీ పరిస్థితి ఘోరంగా తయారైంది. చైనాలో పుట్టిన కరోనావైరస్ దేశంలోని ఇతర దేశాలకు వ్యాపించింది. క్రమంగా చైనా కరోనావైరస్ నుంచి కోలుకుంటుండగా ఇటలీ మాత్రం తీవ్రంగా దెబ్బ తింటోంది.

Coronavirus: Italy in danger, China recovers
Author
Italy, First Published Mar 20, 2020, 12:17 PM IST

ఇటలీలో రోజు రోజుకు కరోనా బాధితులు పెరిగిపోతున్నారు.  కరోనా బారిన పడిన వ్యక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికే అక్కడ 41 వేలమందికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  గురువారం ఒక్కరోజే 500 మంది మరణించారు.  దీంతో ఇటలీలో మృతుల సంఖ్యా 3,405 కు చేరింది. చైనాలో కరోనా వలన 3250 మంది మరణించారు.  ఈ సంఖ్యను ఇటలీ బీట్ చేసింది.  

అంతేకాదు, నిన్న ఒక్కరోజే 5,322 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచం మొత్తం మీద ఇటలీపైనే ఎక్కువ ప్రభావం కనిపిస్తున్నది.  యూరప్ దేశాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నది.  రోజు రోజుకు ప్రభావం పెరిగిపోతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దని అంటున్నారు అధికారులు.

కరోనా వైరస్ లేదా కోవిడ్ 19 నుంచి చైనాకు ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో మరింతగా కరోనావైరస్ వ్యాపిస్తుండగా, చైనాలో మాత్రం రివర్స్ ధోరణి ప్రారంభమైంది. కరోనావైరస్ చైనాలో పుట్టి ఇతర దేశాలకు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మీద చేసిన సమరంలో చైనా విజయం సాధించినట్లే కనిపిస్తోంది. 

తమ దేశంలో మొదటిసారి జీరో డొమెస్టిక్ ఇన్ఫెక్షన్స్ నమోదైనట్లు బీజింగ్ వర్గాలు చెప్పాయి. 

అయితే, విదేశాల నుంచి వచ్చే కరోనా అనుమానిత కేసులు చైనాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా పుట్టిన వూహన్ నగరంలో కొత్తగా కరోనా కేసులేవీ నమోదుకాలేదని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. 

జనవరి 23వ తేదీ నుంచే వూహన్ లోని కోటీ పది లక్షల మందిని స్ట్రిక్ట్ క్వారంటైన్ చేశారు.  ఆ తర్వాత హుబీ ప్రావిన్స్ లోను, ఇతర రాష్ట్రాల్లోనూ నాలుగు కోట్ల మందిని క్వారంటైన్ చేశారు. ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. 

హుబీ ప్రావిన్స్ లో 8 మరణాలు సంభవించాయి. చైనాలో ఇప్పటి వరకు కరోనామరణాలు 3,245 సంభవించినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చైనాలో 81 వేల ఇన్ఫెక్షన్లు బయపడ్డాయి. వారిలో 7,263 మంది కరోనా వైరస్ బారిన పడినట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల 8,700 మంది మరణించారు. దాదాపు 2 లక్షల మందికి వ్యాధి లక్షణాలు కనిపించాయి. 

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తొలిసారి ఈ నెల 10వ తేదీన వూహన్ నగరాన్ని సందర్శించి కరోనాను అదుపు చేయగలిగినట్లు తెలిపారు. వూహన్, హుబీ తప్ప మిగతా నగరాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios